అవి వార్తలా? యాడ్సా?

ఎన్నికల్లో ధనబలానికి వ్యతిరేకమని చెప్పుకుంటున్న లోక్ సత్తా పార్టీ సంగతి ఇది. ఆ పార్టీ మల్కాజ్ గిరి లోక్ సభ అభ్యర్ధి ఎల్ రత్తయ్య. ఆయన నిన్న ఈనాడు సిటీలో కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి సిటీ మొదటి పేజీలో ఎడ్వర్టోరియల్ రాయించుకున్నారు. మల్కాజ్ గిరిలో రత్తయ్యదే హవా అన్నట్టు న్యూస్ లాగా రాయించుకున్నారు. దీని ప్రభావం ఓటర్ల మీద ఎంత వరకు ఉంటుందో తెలియదు కానీ జర్నలిజం కలుషితమైపోయిందన్నది వాస్తవం. టీవీ చానళ్ళ లాగానే వార్తాపత్రికల యాజమాన్యాలు కూడా డబ్బు కోసం ఎంతకైనా తెగబడుతున్నాయి.












Click it and Unblock the Notifications