వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు ' మైసూరాస్త్రం'

By Santaram
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
చంద్రబాబు నాయుడు మరో పాచిక వేశారు, మైసూరా రెడ్డి ద్వారా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే రాయలసీమ రాష్ట్రం కూడా ఏర్పడాల్సిన అవసరముందని మైసూరా రెడ్డి శ్రీకృష్ణ కమిషన్ ముందు తన వాదన విన్పించారు. కోస్తాంధ్ర, తెలంగాణ తనకు రెండు కళ్ళని గతంలో చెప్పి తెలంగాణ వాదుల ఆగ్రహం నుంచి తప్పించుకున్న చంద్రబాబు రాయలసీమకు చెందిన మైసూరారెడ్డి ద్వారా ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర వాదం విన్పించడం పెద్ద ఎత్తుగడే. చంద్రబాబుకు తెలియకుండా మైసూరా ఈ వాదన తెస్తారని ఎవరూ అనుకోరు. ఐడియాస్ డాట్ కాం అయిన మైసూరారెడ్డి తన బిగ్ బాస్ చంద్రబాబును మెప్పించడానికే ఇలా చేశారని విశ్వసనీయంగా తెలుస్తోంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ కు మరోసారి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న చంద్రబాబు శ్రీకృష్ణ కమిషన్ ను అయోమయంలో నెట్టేందుకే ఇలా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎర్రంనాయుడుతో ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్రం డిమాండ్ ను కూడా చంద్రబాబు విన్పించే అవకాశముంది.

అవసరమైతే పార్టీ పగ్గాలు చేపడుతానని చెబుతున్న బాలకృష్ణను కూడా పిలిపించి చంద్రబాబు మందలించినట్టు తెలుస్తోంది. విలేకరులు రెచ్చగొట్టే విధంగా ప్రశ్నించినందువల్లనే తాను అలా అనవలసి వచ్చిందని, తనకు దురుద్దేశాలు లేవని బాలకృష్ణ చెప్పుకున్నట్టు తెలిసింది. రోశయ్య హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం నానాటికీ ప్రజల దృష్టిలో దిగజారుతోందన్న అభిప్రాయం బలపడుతున్న తరుణంలో చంద్రబాబు చాకచక్యంగా చక్రం తిప్పుతున్నారు. వైఎస్ లేని కాంగ్రెస్ ను తాను జయించడం చాలా సులభమన్న ఆత్మ విశ్వాసం ఆయనలో కన్పిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X