వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియాలో ఆంధ్ర, తెలంగాణ విభేదాలు పరాకాష్టకు

By Santaram
|
Google Oneindia TeluguNews

Sobha Rani
తెలంగాణ, ఆంధ్ర జర్నలిస్టుల మధ్య విభేదాలు రాజుకున్నాయి. నేడు సోమాజీగుడా ప్రెస్ క్లబ్ లో ప్రజారాజ్యం నాయకురాలు శోభారాణి సమైక్యాంధ్రకు అనుకూలంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయగా కొందరు తెలంగాణ రిపోర్టర్లు ఆ విషయాన్ని తెలంగాణ ఉద్యమకారులకు అందించారు. దానితో ముప్పై మంది వరకు తెలంగాణ వాదులు శోభారాణి మీద దాడి చేయడానికి బయలు దేరి వచ్చారు. ఒక ఆంధ్రా రిపోర్టర్ ఈ విషయాన్ని పంజాగుట్ట పోలీసులకు తెలియజేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తెలంగాణ ఆందోళనకారులను సకాలంలో పోలీసులు అడ్డుకోగలిగారు.

ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ను కవర్ చేయడానికి వచ్చిన రిపోర్టర్లు ఈ విధంగా రాజకీయ నాయకుల్లా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్చ ప్రకారం మహిళా నాయకురాలు శోభారాణి మాట్లాడుతున్న విషయాన్ని కవర్ చేస్తే చేయాలి, లేదంటే ప్రశ్నించి సరైన సమాధానాలు రాకపోతే కవర్ చేయకుండా వదిలేయాలి. కానీ ఇలా ఆందోళన కారులకు సమాచారం అందించడం మీడియాకు మచ్చగా పరిణమించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X