వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సబిత స్ధానంలో హోంలోకి రోశయ్య మనిషి!

By Santaram
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
అనుకోకుండా వచ్చిన పదవితో ముసలి రోశయ్యకు నిద్రపట్టడం లేదు. కానీ ఆ పెద్దాయన లిస్టులో తాము ఉన్నామో లేదోనన్న భీతితో దాదాపు ఒక డజను మంది మంత్రులకు నిద్రలేని రాత్రులే. జగన్ మనుషులు అనుకున్న 10 మంది మంత్రులకు ఉద్వాసన తప్పకపోవచ్చు. ఏకులా వచ్చిన రోశయ్య మేకులా మారడం వారికి గుండెల్లో గునపంలా ఉంది.

ఏది ఏమి జరిగినా ఒక మార్పు అయితే ఖాయంలా కన్పిస్తోంది. హోం మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి కొనసాగబోవడం లేదు. ఆమెకు ప్రాధాన్యం లేని ఒక శాఖను ఇచ్చి, డిఎల్ రవీంద్రారెడ్డికి గానీ, మర్రి శశిధర్ రెడ్డికి గానీ ఆ శాఖను అప్పగించే అవకాశాలున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కుమారుడైన శశిధర్ రెడ్డి వివాద రహితుడు, అధిష్టానం దృష్టిలో మంచివాడుగా పేరున్నవాడు. ఇక డిఎల్ రవీంద్రారెడ్డి వైఎస్ జగన్ కు వ్యతిరేక వర్గం. అతడిని హోమంత్రిని చేసి జగన్ గ్రూపునకు చెక్ పెట్టాలని రోశయ్య ఆలోచనగా ఆయన సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X