వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఏర్పాటుపై అనుమాన మేఘాలు?

By Santaram
|
Google Oneindia TeluguNews

Narasimhan
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఇప్పట్లో కేంద్రం సిద్ధంగా లేదన్న విషయం నేటి గవర్నర్ ప్రసంగం ద్వారా చూచాయగా తెలుస్తోంది. ఆయన ప్రసంగంలో కొంత భాగం "కలిసుందాం" అన్నట్టు సాగింది. అసలే శ్రేకృష్ణ కమిషన్ తో విసిగివేసారుతున్న తెలంగాణ వాదులకు నేటి గవర్నర్ ప్రసంగం దెబ్బ మీద దెబ్బ. పైగా తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో ఐక్యత లోపించడం మరో దెబ్బ. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ తెలంగాణ రాష్ట్రం సాదించుకోలేం అని అనుకుంటున్న హార్డ్ కోర్ తెలంగాణ వాదులు ఇతర మార్గాల కోసం అన్వేషిస్తున్నట్టు కన్పిస్తోంది. విద్యార్ధి ఉద్యమం కూడా బలం కోల్పోయినట్టు చెబుతున్నారు.

కెసిఆర్ ఈనెల 17న లోక్ సభ స్పీకరుకు రాజీనామా సమర్పించిన తర్వాత అసలు ఉద్యమం బయటపడుతుందని తెలంగాణ వాదులు వ్యాఖ్యానిస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీపై చుక్కా రామయ్య నేడు ఎంచక్కా పెదవి విరిచారు. ఆ కమిటీతో తెలంగాణ రాష్ట్రం కృష్ణార్పణమైపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు తెలంగాణ విషయంలో చంద్రబాబు నాయుడు తన సహజమైన కపట దోరణిని చూపుతున్నారని టిఆర్ ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. శ్రీకృష్ణ కమిటి నివేదికను శ్రీరామ కమిటీకి నివేదిస్తారన్న జోక్స్ విన్పిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X