'వార్త' సంఘీకి దుర్వార్తేనా?

అయితే, ఈ పదవిని దుర్వినియోగం చేశారనే అభియోగం ఎదుర్కొన్న ఆయనను మరోసారి పెద్దల సభకు పంపడం కష్టమేనని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఢిల్లీలోని తన క్వార్టర్ను నిబంధనలకు విరుద్ధంగా మార్చడం..వ్యాపార కార్యకలాపాలకు వినియోగించినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. బీహార్ రాష్ట్ర ఇన్చార్జిగా విధుల నిర్వహణలోనూ సరిగా పనిచేయలేదని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సంఘీని తప్పించి ఆ స్థానంలో కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరికి రాజ్యసభ సీటు కేటాయించడం ఉత్తమమని పార్టీ అంచనాకు వచ్చినట్లు పీసీసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రోశయ్య, గిరీష్ సంఘీ ఒకే వైశ్య కులానికి చెందినవారు. అయితే సంఘీకి రోశయ్య ఈసారి సహాయం చేయడం కష్టమని పరిశీలకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications