వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూ ఎన్టీఆర్ మామకు కొన్ని వందల కోట్ల ఆస్ధులు

By Santaram
|
Google Oneindia TeluguNews

జూ.ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు ఓ రియల్ ఎస్టేట్స్ అధిపతి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మణికొండలోని కొంత భూమిని రైతుల నుంచి, మరికొంత భూమిని ప్రభుత్వానికె చెందిన కొండల నుంచి ఆయన సేకరించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. రైతుల నుంచి అతి తక్కువ ధరలకు ఎకరాలకు ఎకరాలు కొనుగోలు చేసిన తర్వాత అదే ప్రాంతంలో హైటెక్ సిటీ, మైక్రోసాఫ్ట్ తదితర సంస్ధలు రావడంతో రేట్లు బాగా పెరిగిపోయాయి. ఆ ఒక్క వెంచర్ ద్వారా కొన్ని వందల కోట్లు నార్నే శ్రీనివాసరావు సంపాదించుకున్నాడంటే, చంద్రబాబు హస్తం ఎంత పొడుగ్గా ఉందో అర్ధం చేసుకోవచ్చు. జూ ఎన్టీఆర్ కట్నం గురించి వార్తలు కాకపోయినా కొన్ని వందల కోట్ల ఆస్ధులు ఎన్టీఆర్ కు దక్క నున్నట్తు తెలుస్తోంది.

ఇక స్టూడియో ఎన్ సంగతి. అలా వచ్చిన వందల కోట్లలో కొంత మొత్తాన్ని పెట్టుకుని ఆ చానల్ ను వ్యవస్ధాపించారు. దానికి జన్మనిచ్చిన ఎండీ శివరామప్రసాద్ ను కొద్ది రోజుల్లోనే విసింగించగా, ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఈ చానల్ లో బాబు కుమారుడు నారా లోకేష్ 40 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్టు రూఢీగా తెలుస్తోంది. లోకేష్ అక్కడ లెగ్ పెట్టిన వెంటనే కమ్మ జర్నలిస్టులు ఆయన వెంటపడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఎన్టీవీలో ఉన్న ఒక సోకాల్డ్ సీనియర్ జర్నలిస్టు స్టూడియో ఎన్ కు వెళ్ళడానికి ఆతృత పడుతున్నట్టు సమాచారం. చంద్రబాబు నాయుడితో సిఫార్సు చేయించుకోడానికి మరికొంత మంది కమ్మ జర్నలిస్టులు ప్రయత్నిస్తున్నారట.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X