వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జూ ఎన్టీఆర్ మామకు కొన్ని వందల కోట్ల ఆస్ధులు
ఇక స్టూడియో ఎన్ సంగతి. అలా వచ్చిన వందల కోట్లలో కొంత మొత్తాన్ని పెట్టుకుని ఆ చానల్ ను వ్యవస్ధాపించారు. దానికి జన్మనిచ్చిన ఎండీ శివరామప్రసాద్ ను కొద్ది రోజుల్లోనే విసింగించగా, ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఈ చానల్ లో బాబు కుమారుడు నారా లోకేష్ 40 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్టు రూఢీగా తెలుస్తోంది. లోకేష్ అక్కడ లెగ్ పెట్టిన వెంటనే కమ్మ జర్నలిస్టులు ఆయన వెంటపడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఎన్టీవీలో ఉన్న ఒక సోకాల్డ్ సీనియర్ జర్నలిస్టు స్టూడియో ఎన్ కు వెళ్ళడానికి ఆతృత పడుతున్నట్టు సమాచారం. చంద్రబాబు నాయుడితో సిఫార్సు చేయించుకోడానికి మరికొంత మంది కమ్మ జర్నలిస్టులు ప్రయత్నిస్తున్నారట.
Story first published: Sunday, January 31, 2010, 12:04 [IST]