వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడీపి మళ్ళీ అధికారంలోకొస్తే....

By Santaram
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
ఆశకు హద్దు ఉండదంటారు. అలాగే ఉంది ఇప్పుడు తెలుగుదేశం నాయకుల సంగతి. గతంలో చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ళ పరిపాలన సమయంలో భూముల ద్వారా అంతగా డబ్బు చేసుకోలేకపోయిన టిడిపి నాయకులు ఇప్పుడు వైయస్ ను, ఆయన మనుషులను ఆదర్శంగా తీసుకుని బంగారు కలలు కంటున్నారు. రోశయ్య వంటి నాయకులు ఉన్న కాంగ్రెస్ ఈసారి ఎటూ అధికారంలోకి రాదని, రాబోయేది తెలుగుదేశమేనని నమ్మకం కుదిరిన నాయకులు ఇప్పటినుంచే కొన్ని వివాదాస్పద స్ధలాల వద్ద "రెక్కీలు" నిర్వహిస్తున్నారు. వైయస్ హయాంలో ఎన్నో ప్రభుత్వ, వివాదాస్పద భూములను ఆయన మనుషులు, బినామీలు హం ఫట్ చేసినట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

చంద్రబాబు మీద వత్తిడితెచ్చి నాలుగేళ్ళ తర్వాత అయినా వాటిని కాజేయడానికి ఇప్పటి నుంచే గేమ్ ప్లాన్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా రాయలసీమకు, హైదరాబాద్ నగరానికి చెందిన టిడీపి నాయకులు ఈ వ్యూహ రచనలో ఉన్నారు. ఇదంతా జరిగేది కదా, అది కూడా టిడీపి అధికారంలోకి వచ్చినప్పుడు కదా అనుకోవద్దు. ఇక్కడ చూడాల్సింది రాజకీయ నాయకుల స్వార్ధ, నికృష్ట, నీచ ఆలోచనలను.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X