చిరంజీవి 'తప్పు'లో కాలేశారా?

చిరంజీవి బ్లాక్ మెయిల్ చేశారనే ఉద్దేశంతో అధిష్టానం నేతలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇటువంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలను ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతో అధిష్టానం మొదటి నుంచీ ఉంది. ఇటువంటి బ్లాక్ మొయిల్ రాజకీయాల వల్లనే అత్యంత బలవంతుడిగా పేరు పొందిన వైయస్ జగన్ను అధిష్టానం దూరం చేసుకుంది. శరద్ పవార్ లాంటి బడా నేతలను కూడా పక్కన పెట్టేసింది. ఈ స్థితిలో చిరంజీవి ఒత్తిడి రాజకీయాన్ని అధిష్టానం సీరియస్గా తీసుకుంటోందని అంటున్నారు. దీనివల్ల చిరంజీవిపై అధిష్టానం పెద్దలకు గౌరవం తగ్గిందని అంటున్నారు. ఇద్దరు నాయకుల సలహా వల్లనే చిరంజీవి తన సహజశైలికి భిన్నంగా వ్యవహరించారనే పుకార్లు షికారు చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications