జగన్ కేసు: సూరీడిపై సిబిఐ ఒత్తిడి?

వైయస్ జగన్కు, ఆయన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని సిబిఐ సూరీడిపై తీవ్రమైన ఒత్తిడి పెడుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు. వైయస్ జగన్కు బెయిల్ రాకుండా సిబిఐ కుట్ర చేస్తోందని కూడా విమర్శిస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి రావడానికి ముందుకు ఆయనకు, వైయస్ జగన్కు, ఆయన కుటుంబ సభ్యులకు బెరైటీస్ గునలు తప్ప మరేమీ లేదని సూరీడు సిబిఐకి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
వైయస్ జగన్ సంపదను పోగు చేసుకోవడానికి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియ మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు కూడా సూరీడు సిబిఐకి చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, అవే విషయాలను మెజిస్ట్రేట్ ముందు చెప్పడానికి సూరీడు నిరాకరించినట్లు సమాచారం.
సిబిఐ వద్ద కీలకమైన విషయాలను బయట పెట్టిన సూరీడు మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వాల్సి వచ్చేసరికి వెనక్కి తగ్గారని అంటున్నారు. దీనిపైనే సూరీడిపై సిబిఐ తీవ్రమైన ఒత్తిడి పెడుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications