వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాదయాత్రలోనూ మారని బాబు అలవాట్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
అనంతపురం: ప్రజల మధ్యకు వెళ్లడానికి వస్తున్నా మీ కోసం పేరిట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్నా తన అలవాట్లను మాత్రం మార్చుకోలేే
వస్తున్నా మీకోసం అంటూ మహా పాదయాత్రకు అనంతపురం జిల్లా హిందూపురం నుంచి అక్టోబర్ 2వ తేదీ శ్రీకారం చుట్టిన ఆయన ఆరోగ్యం, భోజనం, విశ్రాంతి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఆయన రాత్రిపూట అన్ని హంగులతో తీర్చిదిద్దిన హైటెక్ ఎసి బస్సులో నిద్రిస్తున్నారు. దీనికి తోడు మధ్యాహ్నం, రాత్రి పూట భోజనాలు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఏసి మినీ బస్సులో చేస్తున్నారు. రాత్రిపూట పాదయాత్ర ముగియగానే అప్పటికే అక్కడికి చేరుకున్న ఎసి బస్సులోకి బాబు చేరుకుంటున్నారు. మరుసటి రోజు పాదయాత్ర ప్రారంభమయ్యేదాకా ఆయన బస్సు దిగడం లేదు.

ఉదయం నిద్రలేవగానే అందులోనే ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మరుగుదొడ్డిలో కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. అనంతరం కొద్దిసేపు యోగా చేసి స్నానాదులు పూర్తయిన తరువాత పూజ చేస్తున్నారు. అనంతరం అల్పాహారం తీసుకుంటున్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు దాదాపు అరగంట పాటు జిల్లా టిడిపి నేతలతో అంతర్గత చర్చలు జరుపుతున్నారు. అనంతరం బయటకు వచ్చి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. గత మూడు రోజులుగా బాబు దినచర్య ఈ విధంగా కొనసాగుతోంది.

మొదటి రెండు రోజులు రాత్రిపూట పాదయాత్ర ముగిసేటప్పడికి అర్ధరాత్రి దాటడంతో ఉదయం ఆలస్యంగా పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రకు శ్రీకారం చుట్టిన బాబు ప్రత్యేక ఆహార నియమాలు పాటిస్తున్నారు. వంటకోసం వ్యక్తిగత వంటమనిషి, సిబ్బంది ప్రత్యేక వాహనంలో పాదయాత్రను అనుసరిస్తున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు చంద్రబాబుకు అవసరమైన కాఫీ, టీ, పండ్లరసాలు, అల్పాహారం, భోజనం, రొట్టెలు తయారు చేస్తున్నారు.

మధ్యాహ్నం సులభంగా జీర్ణమయ్యే పదార్థాలు రాత్రిపూట ఉప్మా, పొంగలి, పండ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వంట మనిషి సుధాకర్ ముందుగా ఇచ్చే మెనూ మేరకు ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నారు. పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు బీట్‌రూట్ రసం, కీర రసం తదితర పండ్ల రసాలు తాగుతున్నారు. గురువారం మధ్యాహ్నం చంద్రబాబు నాయకులతో కలిసి టెంట్‌లో భోజనాలు చేస్తారని భావించారు. పెనుకొండ దర్గా సర్కిల్‌లో మినీ బస్సులోకి ఆయన ఒక్కరే వెళ్ళి భోజనం చేసి బయటకు వచ్చారు. గత రెండు రోజులుగా మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో బాబు భోజనం చేయగా రాత్రి వేళల్లో పాదయాత్ర ముగిసిన తర్వాత భోజనం చేస్తున్నారు.

English summary

 Though the Telugudesam party president N Chandrababu Naidu taking his padayatra to mingle with people, he has not changed his rules regarding health and food. He also doing yoga every day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X