పార్థసారథిని కాపాడిన చంద్రబాబు
పార్థసారథిని కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను అడ్డం పెట్టినట్లు చెబుతున్నారు. బీసీలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తూ చంద్రబాబు బీసీ డిక్లరేషన్ను ప్రకటించిన నేపథ్యంలో బీసీ అయిన పార్థసారథి చేత రాజీనామా చేయిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అందువల్ల పార్థసారథి చేత ఇప్పుడే రాజీనామా చేయించడం మంచిది కాదని ముఖ్యమంత్రి అధిష్టానానికి నచ్చజెప్పారు.
ఇప్పటికే బీసీ నాయకుడు మోపిదేవి వెంకటరమణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఇరుక్కుని మంత్రి పదవికి రాజీనామా చేశారని, మరో బీసీ నేతతో మంత్రి పదవికి రాజీనామా చేయిస్తే బీసీల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. పైగా, తనకు పడిన శిక్షను సవాల్ చేస్తూ పార్థసారథి హైకోర్టుకు వెళ్తున్నారని, హైకోర్టు నిర్ణయం వెలువడిన తర్వాత పార్థసారథికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవచ్చునని ముఖ్యమంత్రి అధిష్టానానికి వివరించినట్లు చెబుతున్నారు.
చంద్రబాబు ఆ రకంగా పార్థసారథి మంత్రి పదవిని కాపాడారని అనుకుంటున్నారు. పార్థసారథి చేత రాజీనామా చేయిస్తే తాము ఆందోళనకు దిగుతామని బిసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. బీసీ సంఘాలు పార్థసారథికి అండగా నిలుస్తున్నాయి. అదే సమయంలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పార్థసారథికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. మొత్తం మీద పార్థసారథికి బీసీ కార్డు ఉపయోగపడినట్లే చెప్పాలి.