కిరణ్ కుమార్ రెడ్డిపై మేడం సోనియా గుర్రు

సమాచార కమీషనర్ల నియామకంపై కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి వివరణ కోరినట్లు తెలుస్తోంది. మేడం అసంతృప్తిగా ఉన్నారని అహ్మద్ పటేల్ చెప్పారట. ఎనిమిది కమీషనర్లలో నలుగురికి రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండడమో, ఇతర పదవుల్లో ఉండడమో జరిగిందని అంటున్నారు. విజయ నిర్మల ప్రజారాజ్యం తరఫున గత ఎన్నికల్లో పోటీ చేయగా, లామ్ తాంతియా కుమారి కాంగ్రెసు జడ్పిటిసి. మరీ విచిత్రమేమిటంటే ఇంతియాజ్ అహ్మద్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపైనే పీలేరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత కాంగ్రెసులో చేరారు. ప్రతిఫలంగా ముఖ్యమంత్రి ఆయనకు సమాచార కమిషనర్ పదవిని కట్టబెట్టారు.












Click it and Unblock the Notifications