జగన్ నో ప్రామీస్: మద్దాలి రాజేష్ డ్రామా?
అయితే, ఆయన తన రాజీనామా లేఖలను స్పీకర్ ఫార్మాట్లో ఇవ్వలేదని అంటున్నారు. అది తెలియకపోవడం వల్ల జరిగిన పొరపాటు కాదని అంటున్నారు. కావాలనే, తన రాజీనామా ఆమోదం పొందకుండా ఉండడానికే ఆయన ఆ రకంగా చేశారట. ఇంతకీ ఆయన ఎందుకలా చేశారనేది ప్రశ్న. ఆయన వైయస్ జగన్ను కలిసి, ఆ తర్వాత పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు చేరారు.
కానీ, చింతలపూడి టికెట్ తనకు ఇస్తానని వైయస్ జగన్ రాజేష్కు హామీ ఇవ్వలేదని అంటున్నారు. పార్టీలో చేరిన తర్వాత చూద్దామని ఆయన అన్నారట. దీంతో వెనక్కి తగ్గడం ఆ పరిస్థితిలో ఇష్టం లేక, శాసనసభ స్పీకర్కు రాజీనామా సమర్పించారు. కానీ, అది ఆమోదం పొందే స్థితిలో లేదని అంటున్నారు.
తాను మాజీనైన తర్వాత టికెట్ రాకపోతే సమస్య వస్తుందని రాజేష్ కుమార్ భావించినట్లు చెబుతున్నారు. ఏమైనా, తెలివి అంటే రాజేష్ కుమార్దే అనే మాట వినిపిస్తోంది.