కోదండపై అలిగి వెళ్లిన తెరాస నేతలు!

పోలీసులు తెలంగాణవాదులకు మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు మాత్రమే అనుమతిచ్చారు. అయితే కోదండరామ్ మాత్రం తెలంగాణపై రోడ్డు మ్యాప్ ప్రకటించే వరకు తాము కదిలేది లేదని చెప్పారు. అయితే ఈ ప్రకటన తెరాస ఎమ్మెల్యేలతో చర్చించకుండానే కోదండరామ్ చేశారని అంటున్నారు. ఇది వారికి ఆసంతృప్తిని కలిగించడమే కాకుండా ఆగ్రహాన్నికూడా తెప్పించిందట. అంతేకాకుండా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేత విమలక్క తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై విమర్శలు చేస్తున్న సమయంలో కోదండ వారించలేదట.
ఈ రెండు ఘటనలు తెరాస ఎమ్మెల్యేలు, నేతలకు మనస్థాపం కలిగించాయని, అందుకే కోదండరామ్ నిరవధిక కవాతు అని ప్రకటించిన వెంటనే అక్కడ నుండి వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. మరోవైపు కవాతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన మీడియా వ్యతిరేక బ్యానర్లను కూడా కోదండరామ్ ఖండించారు. మీడియా వ్యతిరేక బ్యానర్లు పెట్టవద్దని, సీమాంధ్రకు చెందిన మీడియా నచ్చని పక్షంలో రిమోట్ చేతిలో ఉంచుకొని మనకు నచ్చిన ఛానల్స్ పెట్టుకోవాలని సూచించారు. మీడియా వ్యతిరేక బ్యానర్లు తెరాస కార్యకర్తలు పెట్టినట్లుగా భావిస్తున్నారు. ఇది కూడా ఆ పార్టీకి రుచించలేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications