వైయస్ వివేకా ఒంటరి: జగన్కు దూరంగా..!?

పులివెందుల ఉప ఎన్నికల నేపథ్యంలో వదిన వైయస్ విజయమ్మ పైన పోటీకి దిగి ఓడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు వైయస్ పేరు ఛార్జీషీటులో పెట్టడంతో జగన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెసు పార్టీని వీడి తనయుడు వైపుకు వెళ్లారు. ఆయన పార్టీలోకి వచ్చినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో అంతగా ప్రాధాన్యం లభించడం లేదనే వాదనలు మొదటి నుండి వినిపిస్తున్నాయి. వివేకానంద ఆపద సమయంలో రాలేదని భావనలో ఆ పార్టీ క్యాడర్ ఉందట. పార్టీ అధ్యక్షుడి మదిలో కూడా ఆదే ఆవేదన ఉందని అంటున్నారు.
అందుకే జగన్తో పాటు పార్టీ నేతలు ఆయనకు అంతగా ప్రధాన్యత ఇచ్చినట్లుగా కనిపించడం లేదంటున్నారు. పార్టీలో ఆయనకు ప్రాధాన్యత లేకపోవడంతో కొంతకాలం క్రితం వరకు అప్పుడప్పుడు కనిపించారని, ఇటీవల ఆ ప్రాధాన్యత మరింత తగ్గడంతో అసలే కనిపించడం లేదని అంటున్నారు. పార్టీలో ఇంపార్టెన్సు లేకపోవడంతో వైయస్ వివేకా కూడా అంతేదూరంగా ఉండాలనే భావనతో ఉన్నట్లుగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications