వార్త పంచ్: సాక్షిది తప్పన్న జగన్ పార్టీ నేత పిల్లి

జగన్ కోసం పదవులకు రాజీనామా చేశారు. జగన్ కోసం ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి... మాజీ అయ్యారు. మొదటి నుండి జగన్ పేరు తలుస్తూ.. ఆయన వెంటే ఉన్న పిల్లి సుభాష్... జగన్కే చెందిన సాక్షి పత్రిక తీరును తప్పు పట్టడం గమనార్హం. తూర్పు గోదావరి జిల్లా బాలవరంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణను కూడా జనం అడ్డుకున్నారు.
పోలీసుల లాఠీఛార్జీలో పలువురు గాయపడ్డారు. ఆందోళనకారులు కూడా రెచ్చిపోయారు. ఈ ఘటనపై జగన్ పత్రిక సాక్షిలో రాలేదు. దీనిపై పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాకినాడలో పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. థర్మల్ ఆందోళనపై మిగిలిన అన్ని పత్రికలు చక్కగా విశ్లేషిస్తూ వార్తలు ఇచ్చాయని, ఈ పత్రికలో ఎందుకు రాలేదో తనకు అర్థం కావట్లేదని, ఇది తప్పని, దీన్ని తాను ఖండిస్తున్నానని, మీడియా గొంతులేని వారి గొంతుకగా ఉండాలని, రాజకీయం వేరు, వ్యాపారం వేరని ఆయన అన్నారు.
కాగా తూర్పు గోదావరి జిల్లా దొంతమూరు గ్రామంలో కొందరు యువకులు జగన్ దినపత్రిక ప్రతులను దహనం చేశారు. థర్మల్ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు పలకడం లేదని మండిపడ్డారు. గ్రామంలో ఎవరూ ఈ పత్రికను చదవరాదని నినాదాలు చేశారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications