వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పివి హయాంలో సోనియాపై నిఘా వేశారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi - PV Narasimaha Rao
దివంగత ప్రధానమంత్రి పివి నరసింహా రావు అంటే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పడదనే వాదనలు ఎప్పటి నుండో ఉన్నాయి! అందుకు పలు కారణాలు ఉన్నాయని చెబుతారు! అయితే, తాజాగా మరో విషయం బయటకు వచ్చింది! పివి హయాంలో సోనియా కదలికలపై నిఘా పడినట్లుగా ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో వార్తలు వచ్చాయి. హెలీ స్కామ్ మధ్యవర్తుల్లో ఒకరైన క్రిస్టియన్ మైఖేల్ చరిత్రను తవ్వుతున్నప్పుడు ఈ విషయాలు బయటకు వచ్చాయట. పత్రిక ప్రకారం..

రాజీవ్ గాంధీ దుర్మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చేందుకు సోనియా ఆసక్తి చూపించలేదు. అప్పుడు పివి నరసింహా రావును ప్రధాని పదవి వరించింది. ఓ సందర్భంలో పూర్ లేడీ.. అంటూ సోనియాపై పివి సానుభూతితో కూడిన వ్యాఖ్య చేశారని, ఈ విషయాన్ని కొందరు ఆమె చెవిలో వేశారని తెలుస్తోంది. పివిపై ఆమె కోపం పెంచుకోవడానికి ఇదే ప్రధాన కారణమని చెబుతారు.అదే సమయంలో, తాను ప్రధానిగా ఉన్నప్పటికీ పార్టీలో సోనియా మరో అధికార కేంద్రంగా మారుతున్నారనే ఆందోళన పివిని వెంటాడేదట.

పివి, సోనియా మధ్య అంతరం పెరుగుతూ వచ్చిన సమయంలో సోనియా బ్రిటన్ పర్యటనకు వెళ్లారు. సహజంగానే ఆమె బ్రిటన్‌కు ఎందుకు వెళ్లారు? ఎవరిని కలుస్తున్నారు? రాజకీయపరమైన మద్దతు ఏదైనా కూడగడుతున్నారా? వంటి అనేక సందేహాలు ప్రధానిగా ఉన్న పివిలో తలెత్తాయి. ఈ సందేహాలకు సమాధానాలు కనుగొనేందుకే సోనియా కదలికలపై నిఘా వర్గాలు కన్నేశాయట. పివి హయాంలో తనపై నిఘా వేయడంపై సోనియాకు ఆగ్రహం పెంచిందనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

English summary
spide on Sonia Gandhi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X