పురంధేశ్వరిపై బిజెపి సీరియస్: ఇంకా ఎవరైనా..
హైదరాబాద్: మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ప్రకటన బిజెపిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలుగుదేశం పార్టీలో చేరే విషయంపై తాను ఆలోచిస్తున్నట్లు ఆమె చెప్పడం సంచలనం సృష్టించింది. ఆమె ప్రకటనను బిజెపి నాయకత్వం తీవ్రంగానే పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. దానికితోడు, పురంధేశ్వరి తన మనసులో బయపెట్టారని, అలా బయటపడని నాయకులు ఇంకా ఎవరైనా ఆ ఆలోచనలో ఉన్నారా అనేది కూడా ఇప్పుడు బిజెపి నాయకత్వం ఆలోచనలో పడింది.
రాష్ట్ర విభజన తీరును వ్యతిరేకిస్తూ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి, బిజెపిలో చేరినప్పటికీ పురంధేశ్వరికి పోటీ చేయడానికి కోరుకున్న సీటు దొరకలేదు. ఆమె విశాఖపట్నం వదిలేసి రాజంపేటకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఆమె ఓటమి పాలయ్యారు. గత కొంత కాలంగా ఏమీ మాట్లాడని పురంధేశ్వరి సమయం అనుకూలిస్తే టిడిపిలో చేరుతానని చెప్పారు.

పురంధేశ్వరి ప్రకటన బిజెపికి మింగుడు పడడం లేదు. అయితే, బిజెపి నాయకత్వాన్ని కాదని ఆమెను చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తారా అనేది ఓ ప్రశ్న. కాగా, కాంగ్రెసుకు రాజీనామా చేసిన మరో మాజీ మంత్రి కావూరి సాంబశివ రావు మౌనంగా ఉంటున్నారు. ఆయన వంటి నాయకులు కూడా పురంధేశ్వరిలా ఆలోచన చేస్తున్నారా అనేది ఉప్పుడు బిజెపి నాయకత్వం ముందు సమస్య.
కాగా, పురంధేశ్వరిపై ఆంధ్రప్రదేశ్ నాయకత్వం అధిష్టానానికి ఫిర్యాదు చేయడం లాంఛనమేనని అంటున్నారు. ఆమెపై బిజెపి నాయకత్వం చర్యలు తీసుకుంటుందా, ఆమె ఆలోచనను మార్చే ప్రయత్నం చేస్తుందా చూడాలి.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications