సభలో జగన్ బాంబులేస్తారని భయం: బొజ్జల, సాక్షిపై
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు కలిసి శాసన సభలోను బాంబులు వేస్తారేమోనని భయం వేస్తోందని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి శనివారం ఎద్దేవా చేశారు. శాసన సభ లాబీల్లో ఆయన మాట్లాడారు.
బయట బాంబులు వేశారని, నాయకుల పైన బాంబులు వేయించారని, ఇక సభలోను వేస్తారేమోనని భయంగా ఉందని ఆయన అన్నారు. హత్యలు చేసేవారెవరో, రౌడీలు ఎవరో ప్రజలకు బాగా తెలుసునని, దాని పైన కొత్తగా చర్చ అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలోని శాంతిభద్రతల పైన ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు మాట్లాడుతూ.. పొలం గట్టు గొడవల్లో మరణించిన వారిని ప్రభుత్వ హత్యలుగా రాసిన సాక్షి పత్రికలో నిజాలున్నట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. రాజానగరంలో మద్యం ఎక్కువగా సేవించి చనిపోయిన వ్యక్తిది రాజకీయ హత్య అంటూ సాక్షి పత్రికలో తప్పుడు కథనాలు రాశారని రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ అన్నారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications