ఏపీ రాజధాని: సచివాలయంలో హుండీ, తొలగింపు
హైదరాబాద్: కొత్త రాజధాని నిర్మాణానికి విరాళాలు సేకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఉండటమే కాకుండా.. రాజధాని కూడా లేదు. ఈ నేపథ్యంలో రాజధాని కోసం విరాళాలు సేకరిస్తోంది. అందులో భాగంగా హుండీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
కొత్త రాజధాని నిర్మాణానికి విరాళాలు సేకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హుండీల మార్గం కూడా ఎంచుకుంది. ఏపీ సచివాలయంలోని అన్ని బ్లాకుల్లో లిఫ్టు వద్ద హుండీలను ఏర్పాటు చేశారు. నూతన రాజధాని నిర్మాణానికి విరాళముల నిమిత్తము అని దానిపై రాసి, ప్రభుత్వ అధికార చిహ్నం కూడా ముద్రించారు.

ఈ హుండీల ఏర్పాటు చర్చనీయాంశమైంది. పలువురు అందులో డబ్బులు వేస్తున్నారు. సాధారణంగా దేవాలయాల్లో హుండీలు ఉంటాయి. హుండీలలో డబ్బులు వేస్తున్న వారు... రాష్ట్రానికి రాజధాని లేదని, ఇలాంటప్పుడు అందుకోసం హుండీలు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నారు.
అంతకుముందు లేక్ వ్యూ అతిథి గృహంలో హుండీ పెట్టారు. ఇప్పుడు సచివాలయంలో పెట్టారు. అయితే ప్రభుత్వం నుండి అనుమతి లేకుండా హుండీ ఏర్పాటు చేయడంపై సందిగ్ధ పడ్డారట. సీఎస్తో మాట్లాడి ఆ తర్వాత హుండీని తొలగించారు. చంద్రబాబుతో మాట్లాడి లేక్ వ్యూలోని హుండీ కూడా తొలగించే అవకాశముంది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications