నోరు జారి: టిడిపి గెలిస్తుందన్న తెరాస నేత, సారీ
హైదరాబాద్: మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి మైనంపల్లి శనివారం మాట జారారు! తెరాసకు బదులు తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతలోనే ఏం మాట్లాడానో తెలుసుకొని... మళ్లీ సరిదిద్దుకున్నారు.
విషయానికి వస్తే... మైనంపల్లి హన్మంత రావు మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ నేత. పొత్తులో భాగంగా మల్కాజిగిరి సెగ్మెంటును టిడిపి.. బిజెపికి ఇచ్చింది. మల్కాజిగిరి నుండి పోటీ చేసేందుకు ఉత్సుకత చూపుతున్న మైనంపల్లి.. టిడిపిని వీడారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని చెప్పారు.

అంతలోనే కాంగ్రెసు పార్టీలో చేరారు. కాంగ్రెసు పార్టీ మల్కాజిగిరి టిక్కెట్టును మరొకరికి ఇచ్చింది. దీంతో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. కెసిఆర్ ఆయనకు మల్కాజిగిరి టిక్కెట్ హామీ ఇచ్చాకనే ఆయన కారు ఎక్కారు. మూడు రోజుల్లోనే మైనంపల్లి టిక్కెట్ కోసం మూడు పార్టీలు మారారు.
ఇదిలా ఉండగా... శనివారం పలువురు కార్యకర్తలు తెలంగాణ భవనంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడారు. కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో తెరాస జెండా ఎగురవేస్తామని చెప్పబోయి... టిడిపి జెండా ఎగురవేస్తామని చెప్పారు. అంతలోనే సారీ అంటూ... తెరాసను గెలిపిస్తామని చెప్పారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications