బెజవాడ నుంచి నాగార్జున భార్య అమల పోటీ?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్పై బిజెపి నాయకత్వం పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించినట్లు కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలహీనపడుతున్న నేపథ్యంలో బిజెపి బలం పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. గెలుపు గుర్రాల వేటలో పడి సాధ్యమైనంత మందిని పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోంది.
నరేంద్ర మోడీని ప్రధానిని చేయడానికి, కేంద్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బిజెపి కీలకంగా భావిస్తోంది. ఓ వైపు ఇప్పటికే కృష్ణంరాజు బిజెపికి గూటికి చేరారు. తాజాగా, నాగార్జున సతీమణి అమలను పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.

విజయవాడ లోకసభ స్థానం నుంచి నాగార్జున భార్య అమలను బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. విజయవాడ పార్లమెంటు సీటు నుంచి కాంగ్రెసు పార్టీ తిరిగి లగడపాటి రాజగోపాల్ను బరిలోకి దింపుతుందా, లేదా అనేది అనుమానంగానే ఉంది. అయితే, లగడపాటి ఆ సీటును వదులుకుంటారా అనేది కూడా చెప్పలేం.
తెలుగుదేశం పార్టీ నుంచి కేశినేని నానికి ఇప్పటికే సీటు ఖరారైందని అంటున్నారు. అమలను పోటీకి దింపడం ద్వారా ఒకే వర్గానికి చెందిన నాయకుల మధ్య పోటీ రసవత్తరంగా జరుగుతుందని భావిస్తున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications