ఎల్ఎల్ఎం పరీక్షలో కాపీ కొట్టిన ఐజి: డిబార్?
కొట్టాయం: అవినీతి, అక్రమాలను అడ్డుకోవాల్సిన బాధ్యత గల ఓ పోలీసు ఉన్నతాధికారే పరీక్షలో చూచిరాతకు పాల్పడ్డారు. సాక్షాత్తు ఐజీ హోదాలో ఉన్న టిజె జోస్ అనే అధికారి.. కేరళలో జరిగిన ఎల్ఎల్ఎం పరీక్షలో అవకతవకలకు పాల్పడ్డట్టు నిర్ధారణ అయ్యింది.
ఇక్కడి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి చెందిన ఉపసంఘం ఒకటి ఈ మేరకు తేల్చింది. మంగళవారం తన నివేదికను ప్రో ఉపకులపతి షీనా షకూర్కు కమిటీ సమర్పించింది.

'ఇన్విజిలేటర్లు, విద్యార్థుల నుంచి సేకరించిన ఆధారాల ప్రకారం.. ఐజీ టిజె జోస్ చూచిరాతకు పాల్పడ్డారని నిర్ధారణ అయ్యింది' అని కమిటీలోని సభ్యుడొకరు తెలిపారు. ఈ ఏడాది మే 4న కలామెస్సరీలోని సెయింట్ పాల్స్ కళాశాలలో ఈ పరీక్ష జరిగింది.
కమిటీ నివేదిక ఆధారంగా యూనివర్సిటీ పాలక మండలి తన తదుపరి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోనుంది. మూడేళ్ల పాటు పరీక్ష రాయకుండా ఆయనను డిబార్ చేసే అవకాశం ఉంది. ఐజీపై శాఖపరమైన విచారణ కూడా జరుగుతోంది.
-
మంత్రి రాస'లీలలు'.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య! -
"ఆ మంత్రికి మహిళలంటే పిచ్చి.. 5 వేల మందితో అఫైర్" -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications