బ్రాండ్ అంబాసిడర్: రామ్దేవ్ బాబాకు కేబినెట్ హోదా
ఛండీగఢ్: హర్యానా రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ యోగా గురువు రామ్దేవ్ బాబాను నియమించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ సోమవారం నాడు ట్వీట్ చేశారు.
యోగా, ఆయుర్వేదాలకు ప్రాచుర్యం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. బాబా రామ్దేవ్ ఆధ్వర్యంలో వేల రకాల ఆయుర్వేద మూలిక ల చెట్లను నాటి పెద్ద మూలికావనం ఏర్పాటు చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
రాష్ట్రంలోని 6,500 గ్రామాల్లో బాబా రామ్దేవ్ పర్యవేక్షణలో యోగశాలలు నిర్మిస్తామన్నారు. పాఠశాల విద్య నుంచే యోగా, ఆయుర్వేదంతో పాటు ఆధునికత, సంస్కృతి మేళవింపుతో విలువలు కలిగిన విద్యనందించటంలో హర్యానాను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చి దిద్దుతామని అనిల్ విజ్ స్పష్టం చేశారు. రామ్దేవ్ బాబాపై నిర్ణయాన్ని ఏప్రిల్ 21వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది.