సందడి: మహిళలతో కలిసి స్టెప్పులేసిన చంద్రబాబు
చిత్తూరు: ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతిలో నందినాటకోత్సవం ముగింపు బుధవారం జరిగింది. ఈ ముగింపు వేడుకలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్టెప్పులేసి అందర్నీ అలరించారు. చంద్రబాబు తిరుపతిలో బుధవారం నాడు సుడిగాలి పర్యటన చేశారు.
ఆయన బుధవారం ఉదయం విజయవాడ నుంచి తిరుపతి చేరుకున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొని బిజీబిజీగా గడిపారు. చివరగా నగరంలోని మహతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన నంది నాటకోత్సవ అవార్డులను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా అక్కడి కళాకారులతో కలిసి చంద్రబాబు కాలు కదిపారు. మహిళా కళాకారులతో కలిసి స్టెప్పులేసి, హాజరైన వారికి కనువిందు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కళలనే కాక కళాకారులకు కూడా తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుందన్నారు.
More From
-
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు.. -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..!












Click it and Unblock the Notifications