మీ బండారం బయటపెడ్తా: ఏపీ మంత్రికి ఇంజినీరింగ్ బెదిరింపు
కడప: డబ్బు కోసం ఏకంగా రాష్ట్ర మంత్రినే బ్లాక్మెయిల్ చేశాడు ఓ విద్యార్థి. ఆ తర్వాత నాలుగు రోజుల్లో పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ విషయాన్ని చిత్తూరు జిల్లా పోలీసులు శనివారం నాడు మీడియా సమావేశంలో వెల్లడించారు.
కడప జిల్లా పెండ్లిమర్రి మండలం తిప్పరాజుపల్లెకు చెందిన జగన్ రెడ్డి హైదరాబాదులో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అతడు ఈ నెల 3వ తేదీన మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డికి ఫోన్ చేసి బెదిరించాడు.

మీ అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు నా వద్ద ఉన్నాయని, రూ.30వేలు ఇస్తే వాటిని మీకు అందిస్తానని, లేదంటే మీ బండారం బయటపెడతానని అతను ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో మంత్రి పోలీసులకు సమాచారం అందించాడు.
ఆయన చిత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోన్ నెంబర్ను తీసుకొని విచారణ జరిపారు. జగన్ రెడ్డి హైదరాబాదులో ఉన్నట్లు గుర్తించారు. శనివారం నాడు హైదరాబాదులో అతనిని అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి తరలించారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications