మోడీని చుట్టుముట్టిన వందలాది మంది ముస్లీంలు
భోపాల్: ప్రధాని నరేంద్ర మోడీని వందలాది మంది ముస్లీంలు చుట్టుముట్టి 'మోడీ.. మోడీ' అంటూ నినాదాలు చేసిన సంఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. ప్రధాని మోడీ ఇటీవల మధ్యప్రదేశ్లోని భాహ్రాకు వెళ్లారు. ఇది స్వతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ పుట్టిన స్థలం.
అక్కడకు చేరుకున్న ప్రధాని మోడీ ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం తన కాన్వాయ్లో తిరిగి వెళ్తున్నారు. ఈ సమయంలో వందలాది మంది ముస్లీంలు గుమికూడారు. మోడీ ప్రయాణిస్తున్న కారును చుట్టుముట్టారు. అతనికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కెర్లు కొడుతోంది.
వారు ప్రధాని మోడీని కారు చుట్టూ మూగగా.. పోలీసులు వారిని పక్కకు జరిపేందుకు ఇబ్బందులు పడ్డారు. అయితే, ప్రధాని మోడీ కూడా వారి ఆరాటాన్ని అర్థం చేసుకున్నారు. కిందకు దిగి వారిని పలకరించారు. తనకు సమీపంలో ఉన్న ఓ ముస్లీం వ్యక్తిని హత్తుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో హల్చల్ చేస్తోంది. ముస్లీంల నుంచి మోడీకి ఇంత ఫాలోయింగ్ ఉంటే ఓట్లు ఎందుకు పడవని, కొన్ని పార్టీలు బీజేపీకి ముస్లీంలను దూరం చేసే కుట్రలో భాగంగానే ఆ వ్యాఖ్యలు చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications