దాసరి మాటిచ్చారు.. జగన్ను సీఎం చేస్తానని: గుర్తు చేసుకున్న భూమన
వైసీపీలో చేరి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తానని దాసరి ఇటీవలే తమతో చెప్పారని భూమన గుర్తుచేసుకున్నారు.
హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు మరణం సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయ రంగ ప్రముఖులను విషాదంలో ముంచెత్తింది. దాసరితో ప్రత్యక్షంగా,పరోక్షంగా అనుబంధం ఉన్న వ్యక్తులంతా ఆయన అంత్యక్రియలకు బయలుదేరారు. వైసీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా దాసరి అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు.
కాగా, గత కొన్నాళ్లుగా వైసీపీ అధినేత జగన్, దాసరిల మధ్య సాన్నిహిత్యం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జగన్ తన కొడుకు లాంటి వాడని దాసరి పలుమార్లు చెప్పుకొచ్చారు కూడా. ఈ నేపథ్యంలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి దాసరితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వైసీపీలో చేరి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తానని దాసరి ఇటీవలే తమతో చెప్పారని భూమన గుర్తుచేసుకున్నారు.

బుధవారం ఉదయం ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన సందర్భంగా భూమన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయిందని చెప్పారు. సినీ పరిశ్రమలో దాసరి మహా వృక్షం లాంటి వారని, ఆయన ఆశ్రయంలో ఎంతోమంది కళాకారులు పైకి వచ్చారని గుర్తు చేశారు.ఆయన మరణం తీరని లోటు అని ఆవేదన చెందారు.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications