కోనసీమ స్పెషల్ "కోడిగుడ్డు - ఎండు రొయ్యలు కూర" ఎలా చేయాలంటే..?
కోడిగుడ్డు.. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరి ఆహారంలో ఒక ముఖ్య భాగం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యాన్ని అందించే వనరు కావడమే దీని ప్రత్యేకత. కేవలం రుచికే కాకుండా, శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందించడంలో గుడ్డును మించిన ఆహారం లేదని చెప్పవచ్చు. గుడ్డు అనేది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఆరోగ్యానికి మేలు చేయడమే.. కాకుండా ఎక్కువగా ఇష్టపడే ఆహారంగా గుర్తింపు పొందింది.
అయితే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో సముద్రపు ఆహారంతో చేసే వంటకాలకు ప్రత్యేక స్థానం ఉంది. అందులో కోడిగుడ్డు - ఎండు రొయ్యల ఇగురు (Dry Prawns Egg Curry) ఒక ప్రత్యేక రుచికరమైన వంటకం. ఎండు రొయ్యల సువాసన, గుడ్ల మృదుత్వం, మసాలాల తాళింపు కలిసి ఈ కూరకు ఘుమఘుమల రుచి ఇస్తాయి. వేడి అన్నం, నెయ్యి చుక్క, పక్కన ఉల్లిపాయ ముక్కలతో తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ టేస్టీ రెసిపీ మీకోసం ప్రత్యేకంగా..

కావలసిన పదార్థాలు...
ఎండు రొయ్యలు - 1 కప్పు
కోడిగుడ్లు - 4 నుంచి 5 (ఉడికించినవి)
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
టమోటాలు - 2 (ముక్కలు)
పచ్చిమిర్చి - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
కారం - 1½ టీస్పూన్లు
పసుపు - ¼ టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - ½ టీస్పూన్
గరం మసాలా - ½ టీస్పూన్
కరివేపాకు - కొద్దిగా
కొత్తిమీర - అలంకరణకు
ఉప్పు - తగినంత
నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఐచ్చికంగా:
చింతపండు రసం లేదా చింతచిగురు - కొద్దిగా
వంకాయ లేదా బీరకాయ ముక్కలు - ఒక చిన్న కప్పు
తయారీ విధానం..
ఎండు రొయ్యలు శుభ్రం చేయడం..
ముందుగా ఎండు రొయ్యల తలలు, తోకలు తీసేయాలి. వాటిని వేడి నీటిలో 10 నిమిషాలు నానబెట్టి బాగా కడిగి నీరు పిండేయాలి. ఇలా చేయడం వల్ల నీచు వాసన తగ్గి రుచి మెరుగవుతుంది.
గుడ్లు సిద్ధం చేయడం..
కోడిగుడ్లను ఉడికించి, పై పొట్టు తీసి, స్వల్పంగా గాట్లు పెట్టాలి. ఇలా చేస్తే మసాలా లోపలికి బాగా పడుతుంది.
తాళింపు & మసాలా..
పాన్లో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర (ఐచ్చికం) వేయాలి. కరివేపాకు, పచ్చిమిర్చి వేసి తాళింపు ఇవ్వాలి.
తర్వాత ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముదురు వాసన పోయే వరకు కలపాలి.
ఎండు రొయ్యలు వేయించడం..
శుభ్రం చేసిన ఎండు రొయ్యలను వేసి మధ్య మంటపై 5-7 నిమిషాలు దోరగా వేయించాలి. ఈ దశలోనే మంచి సువాసన వస్తుంది.
కూర మగ్గించడం..
టమోటా ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి నూనె పైకి వచ్చే వరకు మగ్గించాలి.
పులుసు తరహాలో కావాలంటే కొద్దిగా నీరు లేదా చింతపండు రసం వేసి ఉడికించాలి.
గుడ్లు కలపడం..
చివరగా ఉడికించిన గుడ్లను వేసి మసాలా పట్టేలా జాగ్రత్తగా కలపాలి. చిన్న మంటపై 5-10 నిమిషాలు ఉడికించాలి.
చివరగా గరం మసాలా చల్లి కొత్తిమీరతో అలంకరించాలి.
రుచికి చిట్కాలు..
కొద్దిగా మిరియాల పొడి చల్లితే స్పైసీ ఫ్లేవర్ పెరుగుతుంది.
వంకాయ ముక్కలు జోడిస్తే ఇగురు మరింత రుచిగా ఉంటుంది.
చింతచిగురు వేసిన వెర్షన్ కోనసీమలో చాలా ఫేమస్.
నెయ్యి చుక్క వేసి వేడి అన్నంతో తింటే అద్భుత రుచి.
వడ్డించే విధానం..
వేడి అన్నం + నెయ్యి, చపాతీ / రోటీ, జొన్న రొట్టె, సాదా పెరుగు అన్నంతో కూడా బాగుంటుంది
-
శనగపప్పు పాయసం ఇలా చేస్తే ఎంత రుచిగా ఉంటుందంటే.. అసలే వదిలిపెట్టరు! -
"టమాటా - ఎండు చేపల కూర" ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ కావాల్సిందే..! -
'వెయిట్ లాస్ సూప్'.. ఇలా చేసుకుని తాగితే వెయిట్ లాస్ గ్యారంటీ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications