గుంటూరు స్పెషల్ "కోవా మాల్ పూరీ" ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలంటే..?
తెలుగు రాష్ట్రాలలో తీపి వంటకాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మరి ముఖ్యంగా గుంటూరు ప్రాంతానికి చెందిన తీపి వంటకాల్లో "కోవా మాల్ పూరీ"కి ప్రత్యేక స్థానం ఉంది. బయట దొరికే ఈ రుచికరమైన స్వీట్ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. కరకరలాడే పూరీ, తీయటి చక్కెర పాకం, లోపల నిండిన మృదువైన పాలకోవా.. ఇలా అన్నీ కలిపి ఇది నిజంగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే డిజర్ట్ అని చెప్పొచ్చు.
ఈ కోవా మాల్ పూరీని ప్రత్యేక సందర్భాల్లో, పండుగల సమయంలో లేదా ఈవెనింగ్ స్నాక్గా సర్వ్ చేయొచ్చు. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడే ఈ స్వీట్ అతిథులకు కూడా మంచి ఆప్షన్ గా నిలుస్తుంది. ఇంట్లో సులభంగా తయారయ్యే ఈ గుంటూరు స్పెషల్ కోవా మాల్ పూరీ, రుచి పరంగా రెస్టారెంట్ స్థాయిలో ఉంటుంది. తక్కువ పదార్థాలతో ఎక్కువ టేస్ట్ ఇచ్చే ఈ డెజర్ట్ని ఒక్కసారి ట్రై చేస్తే మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మరింత రుచిగా, పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో మీకోసం ప్రత్యేకంగా..

కావలసిన పదార్థాలు..
మైదా పిండి లేదా గోధుమ పిండి - 1 కప్పు
చక్కెర - 1 కప్పు
పాలకోవా - 100 గ్రాములు
నీళ్లు - ½ కప్పు
యాలకుల పొడి - ½ టీస్పూన్
నెయ్యి - 1 టీస్పూన్ (సువాసన కోసం)
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
జీడిపప్పు, బాదం - గార్నిష్ కోసం
కుంకుమపువ్వు (ఐచ్ఛికం) - రిచ్ టేస్ట్ కోసం
చక్కెర పాకం తయారీ..
మొదట ఒక గిన్నెలో చక్కెర, నీళ్లు వేసి మరిగించాలి. ఒక తీగ పాకం వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత యాలకుల పొడి, కుంకుమపువ్వు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పాకం చాలా గట్టిగా కాకుండా మిడిల్ కన్సిస్టెన్సీలో ఉండాలి.
పూరీ పిండి సిద్ధం..
మైదా లేదా గోధుమ పిండిలో కొద్దిగా నెయ్యి వేసి కలిపి, తగినంత నీళ్లు లేదా పాలు పోసి గట్టిగా కలుపుకోవాలి. పిండి చాలా పల్చగా కాకుండా, పూరీకి సరిపోయేలా ఉండాలి. దీన్ని 10-15 నిమిషాలు మూతపెట్టి ఉంచితే పూరీలు మెత్తగా వస్తాయి.
పూరీలు వేయించే విధానం..
కడాయిలో నూనె బాగా వేడి అయ్యాక, పిండిని చిన్న ఉండలుగా తీసుకుని పూరీలా వత్తాలి. మధ్యస్థ మంటపై రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించాలి. పూరీలు కరకరలాడేలా ఉండాలి.
పాకంలో ముంచడం..
వేయించిన పూరీలను వెంటనే గోరువెచ్చని చక్కెర పాకంలో వేయాలి. సుమారు 30 సెకన్ల నుంచి 1 నిమిషం వరకు ముంచి తీసుకోవాలి. ఎక్కువసేపు ముంచితే పూరీ సాఫ్ట్ అయిపోతుంది.
కోవా ఫిల్లింగ్ & అలంకరణ..
పాకం పట్టిన పూరీ మధ్యలో పాలకోవా పెట్టాలి. తర్వాత దాన్ని సగానికి మడిచి, పైగా జీడిపప్పు, బాదం తురుము చల్లాలి. కొద్దిగా నెయ్యి చిలకరిస్తే రుచి మరింత పెరుగుతుంది.
టేస్ట్ పెంచే చిట్కాలు..
పిండిలో కొద్దిగా రవ్వ కలిపితే పూరీలు ఇంకా క్రిస్పీగా వస్తాయి
పాకంలో రోజ్ వాటర్ లేదా కుంకుమపువ్వు వేసితే ఫ్లేవర్ పెరుగుతుంది
పాలకోవా బదులుగా ఖోయా లేదా కండెన్స్డ్ మిల్క్ మిశ్రమం కూడా ఉపయోగించవచ్చు
వేడిగా సర్వ్ చేస్తేనే అసలైన రుచి తెలుస్తుంది












Click it and Unblock the Notifications