ఈ ఐదు పానీయాలతో డయాబెటిస్ ఇక కంట్రోల్..!!
మధుమేహం. ఈ మధ్య కాలంలో బాగా మధుమేహం బాధితుల సంఖ్య పెరుగుతోంది. మారుతున్న జీవన శైలి.. ఆహారపు అలవాట్లు.. ఒత్తిడితో మధుమేహం బారిన పడుతున్న వారు ఎక్కువగా ఉంటు న్నారు. జీవన శైలిలో మార్పులు.. ఆహార నియంత్రణ.. శారీరక శ్రమ కొంత వరకు మధుమేహాన్ని అదుపులోకి తెస్తోంది. అదే సమయంలో ఈ ఐదు పానీయాలు డయాబెటిస్ నియంత్రణలో బలంగా పనిచేస్తాయి. వైద్యుడి సూచనలతో వీటిని తీసుకుంటే... షుగరు నియంత్రణలో అనూహ్య మార్పు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో షుగర్ హెచ్చుతగ్గులపై ఓ కన్నేసి ఉంచాలి. ఎందుకంటే, ఈ మార్పులు కిడ్నీలు, నరాలు, గుండె సమస్యలకు దారి తీస్తాయి. మందులు, జీవనశైలి మార్పులు చాలా అవసరం. కాకరకాయ చేదుగా ఉన్నా, మధుమేహులకు ఇది ఔషధం లాంటిది. కాకరకాయ లో చారంటిన్, పాలీపప్టైడ్ లాంటి పదార్థాలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్ పనిచేసే విధానాన్ని మెరుగుపరుస్తాయి. ఉదయం పూట తాజాగా తీసిన కాకరకాయ రసాన్ని తాగటం ద్వారా ఫలితం ఉంటుంది. కాకరకాయ రసంతో ఉసిరి రసం కలిపి తాగితే రుచిగా ఉండటంతో పాటుగా షుగర్ను నియంత్రణలో ఉంచుతుంది. కిడ్నీ, కాలేయ ఆరోగ్యానికి కూడా సాయం చేస్తుంది. మెంతుల్లో కరిగే పీచు పదార్థం (సాల్యుబుల్ ఫైబర్) ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. దానివల్ల అల్పాహారం తిన్న తర్వాత రక్తంలో చక్కెర నిల్వలు అమాంతం పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. మెంతులు రాత్రి నీటిలో నానబెట్టి.. ఉదయం ఆ నీటిని తాగాలి. దీని ద్వారా షుగర్ నియంత్రణలో ఉంటుంది.

దాల్చిన చెక్క నీరు సైతం శరీరంలోని కణాలు షుగర్ను బాగా గ్రహించేలా సాయం చేస్తుంది. ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని రాత్రి నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని తాగాలి. దీన్ని తాగడం వల్ల రక్తంలో షుగర్ స్థాయులు తగ్గుతాయి. ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. అదే విధంగా ఉసిరి కాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఉసిరిలోని యాంటి ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. దీనివల్ల షుగర్ లెవల్స్ అమాంతం పెరగడం, అకస్మాత్తుగా తగ్గడం ఉండదు. ఉదయం పూట నీటిలో ఉసిరి రసం కలిపి తాగాలి. ఇది రోజంతా షుగర్ లెవెల్స్ను నియంత్రణలో ఉంచుతుంది.ఇక.. గ్రీన్ టీ తోనూ ప్రయోజనాలు ఉన్నాయి. గ్రీన్ టీలోని పాలిఫెనాల్స్ శరీరంలోని కణాలు ఇన్సులిన్కు త్వరగా స్పందించేలా చేస్తాయి. ప్రతిరోజూ గ్రీన్ టీ తాగేవారిలో జీవక్రియలు మెరుగుపడతాయి. చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి. మంచి ఫలితం రావాలంటే, టీలో చక్కెర అస్సలు కలపకుండా తీసుకోవాలి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications