నయా స్టైల్ 'ఎగ్ బుర్జీ'.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్..!
రోజూ కోడిగుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల అరోగ్య ప్రయోజనాలున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకూ వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. రోజూ గుడ్డును ఏదో రూపంలో తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే గుడ్డుతో చాలామంది అనేక రకాల వంటలు చేసుకుంటారు. గుడ్డుతో ఆమ్లెట్, గుడ్డు పులుసు, ఫ్రై, ఎగ్ బుర్జీ చేసుకుంటారు. అయితే ఇప్పుడు నయా స్టైల్ ఎగ్ బుర్జీ తయారీని ఎక్కువగా చేసుకుంటున్నారు. మరి ఈ ఎగ్ బుర్జీ ఎలా తయారు చేయాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
ఎగ్ బుర్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే..కోడిగుడ్లు ఐదు లేదా ఆరు, నూనె తగినంత
పోపు గింజలు రెండు టేబుల్ స్పూన్ లు, ఉల్లిపాయలు రెండు, కరివేపాకు కొద్దిగా, బీన్స్ ముక్కలు ఒక కప్పు, క్యారెట్ ముక్కలు ఒక కప్పు,పసుపు కొద్దిగా, కొత్తిమీర తరుగు తీసుకోవాలి.
ఇక ఎగ్ బుర్జీ తయారీ విధానం చూస్తే.. ముందుగా ఉల్లిపాయలు బీన్స్, క్యారెట్ శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎగ్ బుర్జీ కోసం స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకోవాలి. అందులో నూనె పోయాలి. నూనె వేడయ్యాక పోపు గింజలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే కరివేపాకు వేసుకోవాలి. తర్వాత అందులో పసుపు వేయాలి. కొద్దిసేపు మగ్గించుకున్నాక అంచుల వెంబడి అనుకొని మధ్యలో ఎగ్స్ ను పగులగొట్టి పోయాలి.

ఇప్పుడు బీన్స్ మిశ్రమాన్ని , ఎగ్ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కారంను తగినంత వేయాలి. అదే విధంగా చివరిలో సన్నని కొత్తిమీర తరుగు వేసి దింపుకుంటే సరి.. సూపర్ టేస్టీ ఎగ్ బుర్జీ కర్రీ రెడీ అయినట్టే..
-
ఇంట్లోనే హైదరాబాదీ స్టైల్ "చికెన్ హలీమ్" ఈజీగా ఎలా చేయాలంటే..? -
"పొట్లకాయ పప్పు" ఇలా చేస్తే ఆ టెస్టే వేరబ్బా.. -
డయాబెటిస్ కంట్రోల్ చేసే ఈ పండ్లు తినండి! -
ప్రియాంక బెడ్రూమ్ సీక్రెట్స్ లీక్: బయటపెట్టిందెవరో తెలిస్తే షాకవుతారు! -
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు












Click it and Unblock the Notifications