ఇవి తాగండి... షుగరు టాబ్లెట్లు విసిరి కొట్టండి!
ఈరోజు చిన్న వయసువారి నుంచి పెద్ద వయసువారి వరకు అందరినీ ఇబ్బంది పెడుతున్న అంశం ఏదైనా ఉందా? అంటే.. మధుమేహం అని ముక్తకంఠంతో చెప్పొచ్చు. జీవనశైలిలో మార్పులు రావడంతోపాటు ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడం కూడా మధుమేహం రావడానికి కారణమవుతోంది. అధిక సమయం కూర్చొని పనిచేసేవారు కచ్చితంగా ప్రతిరోజు వ్యాయామం చేయాలని వైద్యులు నొక్కి చెబుతున్నారు. మధుమేహాన్ని అదుపు చేయడానికి కొన్ని ఆహార పదార్థాలున్నాయి.. వాటిగురించి తెలుసుకుందాం.
ప్రతిరోజు నానబెట్టిన మెంతి గింజల నీటిని తాగుతుండాలి. రాత్రివేళ నిద్రించే ముందు ఓ గ్లాసు నీటిలో టీస్పూన్ మెంతులు నానబెట్టాలి. నానబెట్టిన నీటిని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. టైప్2 షుగరు ఉన్నవారు రోజుకు రెండుసార్లు పదిగ్రాముల మెంతుల గింజలను నానబెట్టి తాగారు. వీటిని తీసుకోవడంవల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉన్నట్లు ఓ జర్నల్ లో ప్రచురితమైంది. హిమోగ్లోబిన్ ఏవన్ సి గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు.

కాకరకాయలో పాలీపెప్టైడ్ సమ్మేళనం బ్లడ్ షుగరు లెవల్స్ అదుపులో ఉంచుతుంది. కాకరకాయ రసం తాగితే షుగరు అదుపులో ఉంటుంది. షుగరు ఉన్నవారు క్రమం తప్పకుండా ఉసిరి రసం తీసుకోవాలి. ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. రెండు లేదంటే మూడు ఉసిరికాయలను మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. వీటిలో ఓ గ్లాసు నీరు కలిపి మళ్లీ మిక్సీ వేయాలి. తర్వాత ఈ రసాని ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీకడుపుతో తీసుకుంటే రక్తంలో షుగరు అదుపులో ఉంటుంది. షుగరు ఉన్నవారికి దాల్చిన చెక్కనీరు బాగా ఉపయోగపడుతుంది. ఒక కప్పు వేడి నీటిలో మూడు లేదంటే నాలుగు చిన్న దాల్చిన చెక్కల్ని వేసి మూతపెట్టాలి. అలా ఒక పది నిముషాల తర్వాత ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత తాగాలి. ఇలా చేయడంవల్ల రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
-
హోటల్ స్టైల్ "చికెన్ ఫ్రైడ్ రైస్" ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలంటే..? -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల












Click it and Unblock the Notifications