Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈ చలికాలంలో వేడివేడి "వాము చారు" తింటే మామూలుగా ఉండదు..!

చలికాలం ప్రారంభం అయ్యింది. ఈ చల్లని వాతావరణంలో వేడివేడి అన్నంతో పాటు ఘుమఘుమలాడే వాము చారు కలిపి తింటుంటే ఆ టెస్టే వేరు. రోజూ చేసే సాధారణ చారులకు భిన్నంగా ఉండే ఈ ప్రత్యేక వాము చారు రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. జలుబు, దగ్గు, గొంతు సమస్యలు వంటి శీతాకాలపు ఇబ్బందులను తగ్గించడంలో వాము కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఈ చారుకి చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటుంటారు.

కాగా వాము సహజంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చలికాలంలో ఎక్కువగా వచ్చే జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో ఇది సహాయ పడుతుంది. తక్కువ సమయంలో తయారయ్యే ఈ చారు, వెచ్చదనాన్ని ఇచ్చే లక్షణం వల్ల ఈ చలికాలంలో మంచిగా ఉపకరిస్తుంది. రోజూ టమాటా చారు, పప్పు రసం వండుతూ విసుగు చెందిన వారికి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. వడలు, పప్పు వడలు లేదా బజ్జీలతో కూడా ఈ చారు ఒక మంచి కాంబినేషన్ అవుతుంది. ఈజీగా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో మీకోసం ప్రత్యేకంగా..

vaamu-charu-making-recipe-in-telugu-with-easy-steps

వాము చారు తయారీకి కావలసిన పదార్థాలు..

వాము పొడి కోసం అవసరమైనవి :

వాము - ½ టేబుల్ స్పూన్

ధనియాలు - 1 టేబుల్ స్పూన్

జీలకర్ర - 1 టీస్పూన్

ఎండుమిర్చి - 2

చారు కోసం అవసరమైనవి :

నూనె - 2 టేబుల్ స్పూన్లు

మెంతులు - 2 చిటికెలు

ఆవాలు - 1 టీస్పూన్

జీలకర్ర - ½ టీస్పూన్

వెల్లుల్లి - 4-5 రెబ్బలు (కొద్దిగా నూరినవి)

పచ్చిమిర్చి - 3

కరివేపాకు - కొద్దిగా

చింతపండు - 30 గ్రాములు (లేదా ఒక కప్పు రసం)

పసుపు - ¼ టీస్పూన్

ఉప్పు - తగినంత

నీరు - అవసరానికి తగ్గట్టు (½ లీటర్ వరకు)

ఉడికించిన పప్పు - ¼ కప్పు

కొత్తిమీర తరుగు - కొద్దిగా

వాము పొడి తయారీ విధానం..

ముందుగా వాము, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చిని మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి.

చింతపండు రసం..

చింతపండును శుభ్రంగా కడిగి 10 నుంచి 15 నిమిషాల వరకు నానబెట్టాలి. తర్వాత 250 ml-300 ml చిక్కటి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ రసం చారు బేస్‌గా పనిచేస్తుంది.

వాము చారు తయారీ ప్రక్రియ..

  • స్టవ్‌పై కడాయి పెట్టి నూనె వేడి చేయాలి. నూనె వేడయ్యాక మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి.
  • తాలింపు వాసన వచ్చాక తుంచిన ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి.
  • తాలింపు బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసి కలపాలి.
  • తర్వాత చింతపండు రసం, పసుపు, ఉప్పు, కరివేపాకు వేసి బాగా కలియబెట్టాలి.
  • ఇప్పుడు అవసరానికి తగ్గట్టు నీళ్లు పోసి మరిగించాలి.
  • మరిగే నీటిలో ముందుగా తయారుచేసుకున్న వాము పొడి వేసి బాగా కలపాలి.
  • ఆపై ఉడికిన పప్పు (పప్పు చారు విధంగా) వేసి మరో 5-10 నిమిషాలు మరిగించాలి. ఇది చారు తగిన మోతాదులో చిక్కదనం, రుచి ఇస్తుంది.
  • చారు బాగా మరిగి బుడగలు వచ్చే సరికి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగు చల్లాలి.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+