చాతుర్మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ పనులు చెయ్యండి!!
చాతుర్మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కొన్ని పనులు చేయాల్సిన అవసరం ఉంది. చాతుర్మాసాన్ని పరమ పవిత్రమైన మాసంగా భావిస్తారు. హిందూ క్యాలెండర్ లో చాతుర్మాసం ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలోని దేవశయని ఏకాదశి నాడు ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరం చాతుర్మాసం జూన్ 29న ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఈసారి చాతుర్మాసం ఐదు నెలల కాలం పాటు కొనసాగనుంది. నవంబర్ 23వ తేదీన కార్తీక మాసం లోని ఉత్థాన ఏకాదశి నాడు చాతుర్మాసం ముగుస్తుంది. చాతుర్మాస కాలంలో శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. అప్పుడు పరమ శివుడు సృష్టి సంరక్షణా బాధ్యతను తీసుకుంటాడు. ఇక తల్లి లక్ష్మీ దేవి సైతం ఈ మాసంలో మహా నిష్ఠతో విష్ణువును సేవిస్తుంది.

అయితే చాతుర్మాసంలో కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. ముఖ్యంగా చాతుర్మాసంలో దానధర్మాలు చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్న మవుతుంది. చాతుర్మాసంలో దానధర్మాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఆహార ధాన్యాలు, గోవులను దానం చేయడం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుందని చెప్పబడింది. చాతుర్మాసం లో భక్తి శ్రద్ధలతో పూజలు, దానం చేయడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయి.
అంతేకాదు చాతుర్మాసంలో మత విశ్వాసాల ప్రకారం తులసీ దేవికి ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల శుభాలు జరుగుతాయని చెబుతారు. ఈ మాసంలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తులసిని పూజించడం వల్ల జీవితంలో వచ్చే కష్టాలు తొలగిపోతాయి. అంతేకాదు కుటుంబంలో ఆనందం శ్రేయస్సు వెల్లివిరుస్తాయి.
చాతుర్మాసంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకుని ఉదయం, సాయంత్రం రెండుపూటలా విష్ణువును పూజించడం వల్ల కూడా లక్ష్మీదేవికి సంతోషం కలుగుతుంది. ఫలితంగా లక్ష్మీ అనుగ్రహం మనకు లభిస్తుంది. అంతేకాదు చాతుర్మాసంలో తెల్లవారుజామునే నిద్ర లేచి, ఇల్లు శుభ్రం చేసుకుని, స్నానం చేసి, భగవంతుడిని పూజించి, ఉపవాస దీక్షను ఆచరించి, ఈ కాలమంతా నేలపైన పడుకుంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications