కర్మకు సాక్షి ఎవరు ? అవే చర్యలను గమనిస్తాయా ? ఆ 18 సాక్షుల సాక్ష్యమే విధిరాతనా ?
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151
మన
కర్మలకు
పద్దెనిమిది
మందిసాక్షులు.
చుట్టూ
ఎవరూ
లేనప్పుడు
తప్పుడు
పనులకు
తెగించడం
మానవ
బలహీనత
.
కానీ
'నేను
ఒక్కడినే
కదా
ఉన్నాను,
నన్ను
ఎవరూ
గమనించడం
లేదు'
అని
మనిషి
అనుకోవటం
చాలా
పొరపాటు
.
మనిషి
ఏ
పని
చేస్తున్నా
నిశితంగా
గమనించేవి
మూగసాక్షులు
పద్దెనిమిది
ఉన్నాయి
.
అవి
నాలుగు
వేదాలు,
పంచభూతాలు,
అంతరాత్మ,
ధర్మం,
యముడు,
ఉభయ
సంధ్యలు,
సూర్య
చంద్రులు,
పగలు,
రాత్రి
.
వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు . ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి .
ఇవి
మనలోకంలోని
న్యాయస్థానాల్లో
సాక్ష్యం
చెప్పపోవచ్చును
గాని,
వీటి
గమనిక
నుండి
మనిషి
తప్పించుకోవడం
సాధ్యపడదు
.
దీన్ని
గుర్తించలేని
కారణంగానే
ఇవన్నీ
జడ
పదార్థాలేనని,
సాక్ష్యం
చెప్పడానికి
నోరులేనివని
మానవుడు
భ్రమపడుతుంటాడు
.
ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి .
అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి .
ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయ. అది వాటిని కర్మలుగా మలుస్తుంది. మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది. సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి .
అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు. ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం .
అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు. అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది. కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే . ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం . కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము . అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పదిహేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం .
నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం .
అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం .
ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు .
ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమైనంత సహాయం చేయాలనే సత్సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం . ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి ప్రయత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు .