ఈ రాశులవారి జీవితాల్లో భారీ మార్పులు... లక్ష్మీ కటాక్షం
గ్రహాలకు రాజైన సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. ఒక రాశి చక్రం పూర్తిచేయడానికి ఆయన ఏడాది సమయం పడుతుంది. ప్రస్తుతం కన్యా రాశి నుంచి తులారాశిలోకి ప్రవేశించాడు. దీన్ని తులా సంక్రమణం అంటారు. దీనివల్ల ఆరు రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం కలగనుంది.
మేషరాశి
దూకుడుగా ఉంటారు. వైవాహిక జీవితంలో అడ్డంకులు ఏర్పడతాయి. విద్యాబోధనకు సంబంధించిన రంగాల్లోనివారిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. భాగస్వామ్యంతో చేసే వ్యాపారాల్లో కూడా ఈ తరహాలోనే ఇబ్బందులు ఎదురవుతాయి. తండ్రి ఆరోగ్య విషయంలో ఆందోళన కలుగుతుంది. మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచుకోవాలి.

వృషభ రాశి
దీర్ఘకాలిక వ్యాధుల నుంచి, రుణ బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. కోర్టు కేసుల్లో విజయం దక్కుతుంది. దూర ప్రయాణం చేస్తారు. కంటికి సంబంధించిన సమస్యలవల్ల ఒత్తిడిని ఎదుర్కొంటారు. తల్లి ఆరోగ్యంపై ఆందోళన కలుగుతుంది. ఆమెకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు. సూర్యుడికి క్రమం తప్పకుండా నీటిని అందించడంవల్ల సమస్యల నుంచి బయటపడతారు.
మిథున రాశి
ధైర్యం తగ్గుతుంది. బోధనా రంగానికి సంబంధించినవారికి అనుకూలంగా ఉండే సమయం ఇది. కడుపులో సమస్యలవల్ల ఒత్తిడిని ఎదుర్కొంటారు. అలాగే పిల్లల వైపు నుంచి కూడా ఆందోళన తలెత్తుతుంది. తండ్రి ఆరోగ్యం మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది.
కర్కాటక రాశి
ఛాతీలో అసౌకర్యంగా ఉంటుంది. బీపీ పెరుగుతుంది. తల్లి ఆరోగ్యంపై ఆందోళన ఉంటుంది. మనసంతా గందరగోళంగా తయారవుతుంది. ప్రభుత్వ వ్యవస్థల నుంచి లాభం కలుగుతుంది. ఇంటికి సంబంధించి లేదంటే వాహనానికి సంబంధించి ఖర్చుల పరిస్థితి ఏర్పడుతుంది. సూర్యుడికి క్రమం తప్పకుండా నీరు ఇస్తుండాలి.
సింహరాశి
పరాక్రమం పెరగడంతోపాటు బంధువులు, స్నేహితుల సాంగత్యంలో వృద్ధి ఉంటుంది. తీవ్రమైన కోపం ఏర్పడుతుంది. పనిలో అదృష్టం తోడుగా ఉంటుంది. తండ్రి నుంచి మద్దతు లభిస్తుంది. మనసులో అస్థిరత పెరుగుతుంది.












Click it and Unblock the Notifications