సుపరిపాలన దినోత్సవం నాడు వారణాసిలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురవారం సుపరిపాలన దినోత్సవం సందర్భంగా తన నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటించనున్నారు. మోడీ ప్రభుత్వం మాజీ ప్రధాని వాజ్పేయి పుట్టినరోజైన డిసెంబర్ 25న జాతీయ సుపరిపాలనా దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
గురువారం ప్రధాని మోడీ వారణాసిలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని బీజేపీ నేతలు తెలిపారు. గత నెలలో వారణాసిలో అస్సీ ఘాట్లో ప్రధాని ప్రారంభించిన స్వచ్ఛ భారత్లో భాగంగా చేపడుతున్న పారిశుధ్ద్య కార్యక్రమాలను ఆయన పరిశీలించనున్నారు.
నవంబర్ 8న వారణాసికి వచ్చిన ప్రధాని మోడీ శనివారం ఉదయం ఆయన అస్సీ ఘాట్ లో గంగా పూజలో పాల్గొన్నారు. గంగమ్మకు పూజలు నిర్వహించారు. స్వయంగా పార చేతబట్టి... మట్టిని ఎత్తి పోశారు. అనంతరం ఆయన అస్సీ ఘాట్ లో 'నిర్మల్ గంగ' కార్యక్రమంలో పాల్గొని గంగమ్మ ప్రక్షాళనకు నడుం బిగించారు.
ఈ కార్యక్రమంలోనే ప్రధాని మోడీ ఉత్తర ప్రదేశ్ కు చెందిన 9మందిని స్వచ్ఛ్ భారత్ లో పాల్గొనాలని ఆహ్వానించారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో పాటు క్రికెట్లర్లు సురేష్, రైనా, మహ్మద్ కైఫ్ , ప్రముఖ హాస్యనటుడు రాజీవ్ శ్రీవత్సవ్ తదితరులు స్వచ్ఛ్ భారత్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అనంతరం మాట్లాడిన మోడీ గంగానది ప్రక్షాళణ మూడు నెలలలో పూర్తి అవుతుందని స్వచ్ఛంద సంస్థలు హామీ ఇచ్చాయన్నారు.