సుపరిపాలన దినోత్సవం నాడు వారణాసిలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురవారం సుపరిపాలన దినోత్సవం సందర్భంగా తన నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటించనున్నారు. మోడీ ప్రభుత్వం మాజీ ప్రధాని వాజ్పేయి పుట్టినరోజైన డిసెంబర్ 25న జాతీయ సుపరిపాలనా దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
గురువారం ప్రధాని మోడీ వారణాసిలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని బీజేపీ నేతలు తెలిపారు. గత నెలలో వారణాసిలో అస్సీ ఘాట్లో ప్రధాని ప్రారంభించిన స్వచ్ఛ భారత్లో భాగంగా చేపడుతున్న పారిశుధ్ద్య కార్యక్రమాలను ఆయన పరిశీలించనున్నారు.

నవంబర్ 8న వారణాసికి వచ్చిన ప్రధాని మోడీ శనివారం ఉదయం ఆయన అస్సీ ఘాట్ లో గంగా పూజలో పాల్గొన్నారు. గంగమ్మకు పూజలు నిర్వహించారు. స్వయంగా పార చేతబట్టి... మట్టిని ఎత్తి పోశారు. అనంతరం ఆయన అస్సీ ఘాట్ లో 'నిర్మల్ గంగ' కార్యక్రమంలో పాల్గొని గంగమ్మ ప్రక్షాళనకు నడుం బిగించారు.
ఈ కార్యక్రమంలోనే ప్రధాని మోడీ ఉత్తర ప్రదేశ్ కు చెందిన 9మందిని స్వచ్ఛ్ భారత్ లో పాల్గొనాలని ఆహ్వానించారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో పాటు క్రికెట్లర్లు సురేష్, రైనా, మహ్మద్ కైఫ్ , ప్రముఖ హాస్యనటుడు రాజీవ్ శ్రీవత్సవ్ తదితరులు స్వచ్ఛ్ భారత్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అనంతరం మాట్లాడిన మోడీ గంగానది ప్రక్షాళణ మూడు నెలలలో పూర్తి అవుతుందని స్వచ్ఛంద సంస్థలు హామీ ఇచ్చాయన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications