వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్క్‌వా సెంచరీతోఆసీస్‌ విజయం

By Staff
|
Google Oneindia TeluguNews

పూణ: భారత్‌పై ఆస్ట్రేలియా రెండోవన్డే మ్యాచ్‌లో సునాయసంగా గెలిచింది. ఐదువన్డేల సిరీస్‌లో బుధవారంనాడిక్కడ జరిగిన రెండోవన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారత్‌పైఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ భారత్‌ పెట్టిన 248 పరుగుల లక్ష్యాన్ని 45.1ఓవర్లలో ఛేదించారు.

ఆస్ట్రేలియా ఓపెనర్‌ మార్క్‌వా 133 పరుగులు చేసిఅజేయంగా నిలిచాడు. అతడికి ఇది వన్డేల్లో18వసెంచరీ. భారత్‌ బౌలర్లెవరూ ఆస్ట్రేలియాబ్యాట్స్‌మెన్‌పై ప్రభావం చూపలేకపోయారు.హర్బజన్‌ సింగ్‌తో సహా భారత స్పిన్నర్లు ఈమ్యాచ్‌లో విఫలం కావడం భారత్‌కు నిరాశనేమిగిల్చింది. ఆస్ట్రేలియా మరో ఓపెనర్‌ హెడెన్‌ 57 పరుగులు చేసిజహీర్‌ఖాన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. లెహమాన్‌ రనౌట్‌ అయ్యాడు.బేవాన్‌ 33 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు.ఆస్ట్రేలియా బౌలర్లు ముగ్గురు రెండేసి భారతవికెట్లు తీసుకున్నారు.

భారత్‌ తొమ్మిదివికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌ మెన్‌ హేమాంగ్‌ బదానీసెంచరీ చేయడం భారత్‌ ఇన్నింగ్స్‌ లో హైలైట్‌. కెప్టెన్‌ గంగూలీ 4 పరుగులకే అవుటయ్యాడు. ఆ తరువాత సచిన్‌ మెరుపు వేగంతో 29 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌ లో ఆరు ఫోర్లు ఒకసిక్స్‌ వున్నాయంటే అతని ఇన్నింగ్స్‌ వేగం అర్థం చేసుకోవచ్చు.

లక్ష్మణ్‌-ద్రావిడ్‌ ల మధ్య అవగాహనా లోపంతో ద్రావిడ్‌ రనౌట్‌ అయ్యాడు. ఆ తరువాత లక్ష్మణ్‌ నిదానంగా ఆడుతూఅర్థ సెంచరీ సాధించాడు. లక్ష్మణ్‌ బరిలో వున్నంతసేపు నిదానంగా ఆడిన బదానీ ఆ తరువాత చెలరేగి పోయాడు. కేవలం 98 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇకమిగిలిన బ్యాట్స్‌ మెన్‌ లో ఎవరూ చెప్పుకోతగిన స్కోర్లు చేయలేదు. భారత్‌ ఇన్నింగ్స్‌ లో మూడు రనౌట్లు వుండడం ఆటగాళ్ళ తడబాటుకు అద్దం పడుతున్నది.

త్వరత్వరగా వికెట్లు కోల్పోయినప్పటికీ బదానీ, లక్ష్మణ్‌ ల నిలకడైన బ్యాటింగ్‌ కారణంగా భారత్‌ గౌరవప్రదమైన స్కోర్‌ సాధించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X