వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రులకు తప్పిన విమాన ప్రమాదం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌ విమానాశ్రయంలో పలువురు ప్రముఖులు పెద్ద ప్రమాదాన్ని తృటిలో తప్పించుకున్నారు. సోమవారం ఉదయం ఒక విమానం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సి వుంది. కేంద్ర మంత్రులు జుయెల్‌ ఓరం, బండారు దత్తాత్రేయ, బిజెపి ఉపాధ్యక్షుడు రాందాస్‌ అగర్వాల్‌, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మాజీ ఎంపి టి. సుబ్బరామి రెడ్డి, తదితరులు ఈ విమానంలో ఎక్కారు.

బేగంపేట రన్‌వేపై విమానం బయలుదేరింది. పూర్తి వేగం పుంజుకుని గాలిలోకి ఎగిరే సమయంలో టైర్‌ పంక్చర్‌ అయింది. దీంతో విమానం భారీ కుదుపునకు లోనై అటూ ఇటూ ఊగిపోయింది. సామాన్లు ప్రయాణికులపై పడ్డాయి. వారు భయకంపితులయ్యారు. ఒక ఎయిర్‌ హోస్టెస్‌ భయంతో స్పృహ కోల్పోయింది. చివరికి పైలట్‌ అత్యవసరంగా బ్రేక్‌లు వేసి విమానాన్ని అదుపులోకి తెచ్చాడు. ప్రయాణికులు బతికి బయట పడ్డారు. విమానానికి మరమ్మతులు చేసిన తర్వాత కూడా అందులో ఎక్కేందుకు కేంద్ర మంత్రులు, ప్రముఖులు నిరాకరించారు. అప్పటికే సిద్ధంగా వున్న విమానంలో ముంబాయి వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X