వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోటళ్ల కొనుగోలు కేసులో జయకు సమన్లు

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: లండన్‌లో రెండు హోటళ్లు కొనుగోలు చేసినట్లు దాఖలైన కేసులో సెప్టెంబర్‌ 12వ తేదీన కోర్టుకు హాజరు కావాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు, అన్నాడియంకె పార్లమెంటు సభ్యుడు టి.టి.వి. దినకరన్‌కు సమన్లు జారీ చేయాలని సెషన్స్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రిన్సిపల్‌ సెషన్స్‌ జడ్జి ఎస్‌. అశోక్‌ కుమార్‌ మంగళవారం ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో మరిన్ని వాస్తవాలు తెలిసినందున మరింత దర్యాప్తు చేయాల్సి వుందని, అందువల్ల తమకు ఏడాది గడువు కావాలని నిఘా, అవినీతి నిరోధక డైరెక్టరేట్‌ కోరింది. డైరెక్టరేట్‌ విజ్ఞప్తిని పట్టించుకోకుండా ప్రిన్సిపల్‌ సెషన్స్‌ జడ్జి కేసును విచారణ కోసం సెప్టెంబర్‌ 12వ తేదీకి వాయిదా వేశారు.

దినకరన్‌కు చెందిన కంపెనీలు లండన్‌లో హోటళ్లను కొనుగోలు చేసిన వ్యవహారంపై నిఘా, అవినీతి నిరోధక డైరెక్టరేట్‌ ఏప్రిల్‌ 17వ తేదీన చార్జిషీట్‌ దాఖలు చేసింది.

ఈ హోటళ్ల కొనుగోలుకు 1994లో రెగ్యులర్‌ బ్యాంకింగ్‌ మార్గాల్లోనే కాకుండా వివిధ ఇతర మార్గాల ద్వారా విదేశాలకు జయలలిత 43.98 కోట్ల రూపాయలు తరలించారని డైరెక్టరేట్‌ ఆరోపించింది. ఈ డబ్బులను శ్రీలంక, దుబాయ్‌, మలేషియా, సింగపూర్‌, హాంగ్‌కాంగ్‌ బ్యాంకుల్లో డిమాండ్‌ డ్రాఫ్ట్‌లు కొనుగోలు చేయడానికి వాడినట్లు ఆరోపణ. లండన్‌లోని నాట్‌వెస్ట్‌ బ్యాంక్‌లో సోలిసిటర్‌ నయనేష్‌ దేశాయ్‌ ఖాతాలోకి ఈ నిధులను మళ్లించడంలో దినకరన్‌ ప్రముఖ పాత్ర పోషించారని డైరెక్టరేట్‌ ఆరోపించింది.

ఈ నిధులనే కాకుండా ఇతర అక్రమ మార్గాల ద్వారా వచ్చిన డబ్బులను దినకరన్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని స్టీపుల్‌ ఆస్టన్‌లో గాడ్‌ఫ్రే రిసోర్సెస్‌ కార్పోరేషన్‌ పేర హాప్‌స్క్రాఫ్ట్‌ హాల్ట్‌ హోటల్‌ను, స్లేలే హాల్‌ ఎస్టేట్‌ను కొనుగోలు చేయడానికి వాడారని డివిఎసి ఆరోపించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X