స్ధానిక సంస్ధల్లో రిజర్వేషన్ల ఖరారు
హైదరాబాద్: రాష్ట్రంలో స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఈ ఎన్నికలకు సంబంధించిన అత్యంత కీలకమైన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. పంచాయితీ రాజ్ కమీషనర్ చెల్లప్ప మంగళవారం నాడు హైదరాబాద్లో రిజర్వేషన్ల వివరాలను వెల్లడించారు.
ఒక్క గుంటూరు జిల్లాలో తప్ప మిగిలిన అన్ని జిల్లాలలో గతంలో వున్న రిజర్వేషన్లు మారాయి. ఏడు జిల్లాలను వెనకబడిన వర్గాలకు మరో ఏడు జిల్లాలను మహిళలకు రిజర్వ్ చేశారు. ఆదిలాబాద్, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాపరిషత్లను ఎస్.సి పురుషులకు, కృష్ణా జిల్లా పరిషత్ను ఎస్.సి మహిళలకు కేటాయించారు. విశాఖ జిల్లా పరిషత్ను ఎస్.టి. మహిళలకు కేటాయించారు. అలాగే, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, రంగారెడ్డి జిల్లా పరిషత్లను బి.సి పురుషులకు, చిత్తూరు, నల్లగొండ జడ్పిలను బి.సి మహిళలకు కేటాయించారు.
ఖమ్మం జిల్లాలను ఎస్టిలకు, విశాఖను ఎస్టి మహిళలకు రిజర్వ్ చేశారు. కాగా వరంగల్, కరీంనగర్, గుంటూరు తదితర జిల్లాలు జనరల్ కాటగిరిలో వున్నాయి. జడ్పిటిసి, ఎంపిపి, ఎంపిటిసి, పంచాయితీల రిజర్వేషన్లను కూడా మరో 24 గంటల్లో ఖరారు చేయనున్నట్టుగా చెల్లప్ప చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లకు సంబంధించిన నివేదికను ఎన్నికల సంఘానికి బుధవారం కల్లా సమర్పిస్తామని చెప్పారు.
ఎంపిపి,
ఎంపిటిసి
రిజర్వేషన్లకు
సంబంధించి
తాము
జారీ
చేసిన
మార్గదర్శక
సూత్రాలకు
అనుగుణంగా
జిల్లాల
కలెక్టర్లనుంచి
నివేదికలు
బుధవారం
కల్లా
అందే
అవకాశం
వున్నదని
ఆయన
చెప్పారు.
ఓటర్ల
జాబితా,
బహుళ
ప్రయోజన
గృహసర్వేలోని
సమాచారం,
పాత
రిజర్వేషన్లు
ఆధారంగా
కొత్త
రిజర్వేషన్లను
ఖరారు
చేసినట్టుగా
చెల్లప్ప
వెల్లడించారు.
వివిధ
సంఘాలు,
పార్టీలు
వ్యక్తం
చేసిన
అభ్యంతరాలను
కూడా
రిజర్వేషన్ల
ఖరారు
సమయంలో
పరిగణలోకి
తీసుకున్నట్టుగా
ఆయన
చెప్పారు.