వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశ భవిష్యత్తుకు ఎన్‌డిఎ ముప్పు

By Staff
|
Google Oneindia TeluguNews

ధులె(మహారాష్ట్ర): ఎన్‌డిఎ పాలనలో దేశ భవిష్యత్తుకు ఏమాత్రం భద్రత లేదని కాంగ్రెస్‌ నేత సోనియాగాంధీ పేర్కొన్నారు. ఈ విషయం ప్రజలకు కూడా తెలుసునని ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎన్‌డిఎకు వ్యతిరేకంగా రావడమే ఇందుకు నిదర్శనమని ఆమె చెప్పారు.

మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన సోనియా మంగళవారం నాడు ధులెలో కిసాన్‌ మైదాన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో బిజెపి ఎన్నో కబుర్లు చెప్పిందని, నైతికత గురించి, పారదర్శకత గురించి అనేక హామీలు ఇచ్చిందని అరచేతిలో స్వర్గం చూపి అధికారంలోకి వచ్చిన బిజెపి తర్వాత ఏంచేసిందో ప్రజలకు తెలుసునని ఆమె అన్నారు. అధికారాన్ని అంటిపెట్టుకుని వుండటం కోసం అన్నిరకాల అడ్డదారులను బిజెపి నాయకత్వం తొక్కిందని ఆమె దుయ్యబట్టారు.

దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకుపోవాలంటే త్యాగం చేయగల నాయకత్వం కావాలని ఆమె అన్నారు. కాంగ్రెస్‌ రానున్న యుపి ఎన్నికల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విజయపతాక ఎగురవేసే అవకాశం వున్నదని లాతూర్‌ సభలో ఆమె ప్రకటించారు. విదేశాంగ విధానాన్ని తరుచుగా మార్చడాన్ని ఆమె తూర్పారబట్టారు. పాక్‌ సైనికపాలకుడు జనరల్‌ ముషారఫ్‌తో చర్చలు జరపాలనుకోవడాన్ని సమర్ధిస్తూనే మొదటినుంచే ఈ వైఖరి లేకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X