వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంగూలీ మళ్ళీఫెయిల్‌-ఓటమిబాటలో భారత్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హరారేః బులవాయే లో జింబాంబ్వే పై సాధించినవిజయం తాలూకు ఆనందం భారత్‌ కు మూన్నాళ్ళ ముచ్చటగానేమిగిలింది. హరారేలో జరుగుతున్న రెండోటెస్ట్‌ లో జింబాంబ్వే జట్టు విజయపథంలో దూసుకుపోతున్నది. భారత్‌ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ వరుసగా నాలుగోసారి కూడావిఫలం కావడంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ కేవలం 234 పరుగుల స్కోరు వద్దే ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌ లో 237 పరుగులకు భారత్‌ ఆలౌట్‌అయిన విషయం విదితమే.

తొలిఇన్నింగ్స్‌ లో జింబాంబ్వే 317 పరుగులు చేసి భారత్‌ పై 78 పరుగుల ఆధిక్యం సంపాదించింది. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ లో సచిన్‌, దాస్‌మినహా మరెవరూ చెప్పుకో తగిన స్కోర్లు చేయలేక పోయారు. ఆదివారం 5వికెట్లకు 197 పరుగులు చేసిన భారత్‌ ఆ తరువాత కేవలం 35 పరుగులకేమిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. తొలిటెస్ట్‌ లోను, హరారేటెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌ లోనూ రెండంకెల స్కోరు దాటని కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ రెండో ఇన్నింగ్స్‌ లో ఏకంగా డకౌట్‌ అయ్యాడు. దీనితో గౌరవ ప్రదమైన స్కోరు సాధించాలనే భారత్‌ ఆశలు అడియాశలయ్యాయి.

ఆదివారం 68 పరుగులతో ఆడుతున్న దాస్‌ మరో రెండు పరుగులు చేసి ఆవుటయ్యాడు. ఇక టెయిల్‌ ఎండర్ల సంగతిసరేసరి.... హర్భజన్‌ సింగ్‌ 5, శ్రీనాధ్‌ 5, బదాని 16,అగార్కర్‌ సున్నా స్కోర్లకే అవుటవ్వడంతో భారత్‌ పరాజయం ఖాయమై పోయింది. భారత్‌ పైవిజయం సాధించేందుకు జింబాంబ్వే కేవలం 160 పరుగులు చేయాల్సి వుంది. టీవిరామ సమయానికి జింబాంబ్వే వికెట్‌ నష్ట పోకుండా 20 పరుగులు చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X