ఐటిలో భారత్కు చైనా ముప్పు
పూణ: ఐటి రంగంలో భారత్కు మునుముందు చైనా నుంచి తీవ్రమైన ముప్పు తలెత్తే అవకాశం వుంది. ప్రస్తుతం ఐటి రంగానికి సంబంధించి భారత్తో పోలిస్తే చైనా టెక్నాలజీ, నాణ్యత, ప్రాజెక్ట్ మానేజ్మెంట్ విషయంలో అయిదు సంవత్సరాల వెనకవుంది.
అయితే రెండు మూడేళ్లలోనే చైనా భారత్ను అందుకోవడంతో పాటు గట్టి పోటీని ఇచ్చే అవకాశం వుందని విప్రో చైర్మన్ అజిమ్ ప్రేవ్జీు హెచ్చరించారు. ఐటిలో ఇప్పుడున్న ఆధిక్యతను నిబబెట్టుకునేందుకు అవసరమైన ప్రపంచస్థాయి మౌలికవసతులు భారత్కు లేవని సమకూర్చుకునే ప్రయత్నాలు కూడా చురుగ్గా సాగడంలేదని ఆయన చెప్పారు. సిఐఐ ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతూ, సరైన సమయంలో సరైన పరిశ్రమలో వుండటంతో పాటు మరోవైపు అదృష్టం కూడా తోడయిందని ఆయన తన విజయ రహస్యాన్ని వివరించారు. ఐటి వ్యాపారంలో సంక్షిష్టత రోజురోజుకు పెరుగుతున్నదని ఇది మునుముందు మరింత పెరిగే అవకాశం వున్నదని ఆయన అన్నారు.
-
పెరిగిన
ఇండ్యా
డాట్
కామ్
రెవెన్యూ