వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆంధ్ర ప్రాజెక్టులపై కోర్టుకు
బెంగుళూరు: కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలనుఉల్లంఘించి చేపట్టిన ప్రాజెక్టులపై తాము వచ్చేనెల తొమ్మిదిన సుప్రీంకోర్టులో కేసు వేయనున్నట్టుగా కర్ణాటక ప్రకటించింది.
బచావత్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను ఉల్లంఘించి కృష్ణాజలాల వినియోగానికి ఆంధ్రప్రదేశ్ చేపట్టిన అయిదు ప్రాజెక్టులను కోర్టులో తాము సవాలు చేయనున్నట్టుగా కర్ణాటక మంత్రి హెచ్కె పాటిల్ సోమవారం నాడు వెల్లడించారు. శ్రీశైలం కుడి, ఎడమ కాల్వలు, తెలుగుగంగ నీటి పారుదల ప్రాజెక్టు, పులిచింతల, బీమా ఎత్తిపోతల ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ నిబంధనలను ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. ఈ ప్రాజెక్టుల విషయంలో తాము వ్యక్తం చేసిన అభ్యంతరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోని కారణంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన తెలిపారు.
Comments
Story first published: Monday, June 18, 2001, 23:53 [IST]