మణిపూర్లోకాల్పులు:13మంది మృతి
ఇంఫాల్: మణిపూర్ రాజధాని ఇంఫాల్ సోమవారం నాడు అగ్నిగుండంగా మారింది. ఆందోళనకారులు పెద్దఎత్తున దహనకాండకు, విద్వంసానికి దిగారు. నాగాలాండ్ ఉగ్రవాదులతో ప్రకటించిన కాల్పుల విరమణను మణిపూర్లోని నాగా ప్రాబల్యం గల ప్రాంతాలకు విస్తరించాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా మూడు రోజులుగా సాగుతున్న ఆందోళన హింసాత్మక మలుపు తీసుకున్నది.
నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వీధుల్లోకి వచ్చిన ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు జరిపినకాల్పుల్లో 13 మంది మరణించగా ఆనేక మంది గాయపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీ భవనానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. అసెంబ్లీ భవన సముదాయం, ముఖ్యమంత్రి సచివాలయం, కాంగ్రెస్ భవనం, మణిపూర్ పీపుల్స్ పార్టీ కార్యాలయం, మణిపూర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, మంత్రులు,ఎంఎల్ఎల అధికార నివాసగృహాలు కొన్ని భస్మీపటలం అయ్యాయి.
ఇంఫాల్లో
కర్ఫ్యూను
విధించిన
పోలీసులు
కనిపిస్తే
కాల్చివేత
ఉత్తర్వులు
అమలు
చేస్తున్నారు.
కాల్పుల
విరమణ
విస్తరణకు
నిరసనగా
అఖిలపక్ష
కమిటీ
ఇచ్చిన
మూడు
రోజుల
బంద్
ఆఖరు
రోజు
సోమవారం
నాడు
ఆందోళన
హింసాత్మకమైన
మలుపు
తీసుకోవడంతో
కేంద్రం
కూడా
దిగ్భ్రాంతి
చెందింది.
ఇంఫాల్లో
ఆందోళనకారులు
వాజ్పేయి,
అద్వానీల
దిష్టిబొమ్మలను
దగ్ధం
చేశారు.