వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రధానికి చంద్రబాబు పరామర్శ
ముంబాయి: మోకాలి శస్త్రచికిత్స తర్వాత దాదాపు పూర్తిగా కోలుకున్న ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి మంగళవారం నాడు ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. సోమవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, హర్యానా ముఖ్యమంత్రి ఓంప్రకాష్ చౌతాలా పలువురు కేంద్ర మంత్రులు వాజ్పేయిని కలుసుకుని పరామర్శించారు.
మంగళవారం నాడు డిశ్చార్జవుతున్న ప్రధాని ఘనంగా విడ్కోలు చెప్పడానికి ముంబాయి వాసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కిలోమీటర్ పొడవైన విడ్కోలు బ్యానర్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బ్యానర్పై ఆర్కె లక్ష్మణ్ కార్టూన్లతో పాటు అనేక సందేశాలు, బొమ్మలు వుంటాయి.
-
19న
డిశ్చార్జి
కానున్న
వాజ్
పేయి
Comments
Story first published: Monday, June 18, 2001, 23:53 [IST]