రాయితీలకు హోర్డ్వేర్ రంగం డిమాండ్
బెంగుళూరు: ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ హార్డ్వేర్ రంగం ప్రభుత్వ నియంత్రణల వల్ల అభివృద్ధికి నోచుకోవడం లేదని ఈ రంగానికి ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలని దేశీయ హార్డ్వేర్ పరిశ్రమ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఐటి ప్రాడక్ట్స్ రంగంలో అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై బెంగుళూరులో జరిగిన జాతీయ గోష్టిలో విప్రో నేత అజిమ్ ప్రేమ్జీ, ఐటి ఉత్పత్తిదారుల సమాఖ్య అధ్యక్షుడు వినయ్ దేశ్పాండే ప్రసంగించారు.
ఐటి రంగంలో భారత్ అగ్రరాజ్యంగా ఎదగాలంటే హార్డ్వేర్ డెవలప్మెంట్, ఉత్పత్తిని ప్రొత్సహించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. హార్డ్వేర్ డెవలప్మెంట్, ఉత్పత్తిలో భారత్ తగిన పురోభివృద్ధి సాధించని పక్షంలో రక్షణతో సహా కీలకరంగాల్లో స్వావలంభన కష్టమని అజిమ్ప్రేమ్జీ చెప్పారు. 2008 సంవత్సరం నాటికి దేశం 8700 కోట్ల డాలర్ల మేర సాఫ్ట్వేర్ ఎగుమతులు చేయాలన్న లక్ష్యాన్ని సాధించాలంటే 5000 కోట్ల డాలర్ల హార్డ్వేర్ అవసరం వున్నదని ఆయన చెప్పారు. హార్డ్వేర్ రంగంలో ప్రతికోటి రూపాయల అమ్మకానికి పది ఉపాధి అవకాశాలు పుట్టుకువస్తున్నాయని ఆయనచెప్పారు.